ఆదిలాబాద్, జూలై 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్న ప్రభుత్వం ఆర్థికంగా వెనుబడిన షెడ్యూల్డ్ కులాల(ఎస్సీ) సంక్షేమం కోసం నూతనంగా ‘తెలంగాణ దళిత బంధు’ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దళితుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించిన సర్కారు దళితబస్తీతోపాటు, స్వయం ఉపా ధి కోసం రుణాలు అందిస్తూ ఆర్థికంగా అభివృద్ధి చేస్తున్నది. రైతుబంధు తరహాలోనే దళిత బంధు పథకం ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోనే డబ్బులు వేయనుంది. ఎంపిక విధా నం పారదర్శకంగా ఉండేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకొని ఎంపిక చేయాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న ఈ పథకం దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా దళిత జనాభా 4,82,033 మంది ఉండగా.. ఇందులో ఆదిలాబాద్ జిల్లా లో 99,424, నిర్మల్లో 1,01,520, మంచిర్యాలలో 1,99,493, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 81,596 జనా భా ఉంది. దళిత బంధు పథకం ద్వారా అర్హులైన వారికి లబ్ధి చేకూరనుంది. కాగా.. ఆదిలాబాద్లో దళితులు, టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చే శారు. గతంలో ఏ ప్రభుత్వాలు దళితుల అభివృద్ధిని పట్టించుకోలేదని టీఆర్ఎస్ సర్కారు తమకు అన్ని విధాలుగా అండగా ఉంటున్నదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో..
భూమిలేని దళిత వ్యవసాయాధారిత కుటుంబాలకు ప్రభుత్వం మూడెకరాల భూమిని ఉచితంగా పంపిణీ చేస్తున్నది. ఇందులో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో 1831 మంది లబ్ధిదారులకు రూ.206 కోట్ల విలువైన 4,672 ఎకరాల వ్యవసాయ భూమిని ఉచితంగా పంపిణీ చేసింది. స్వయం ఉపాధి కింద 3648 మందికి రూ.43.74 కోట్ల రుణాలు ఇచ్చింది. నిర్మల్ జిల్లాలో 503 మందికి రూ.58.68 కోట్ల విలువైన 1167 ఎకరాల భూమిని ఉచితంగా పంపిణీ చేసింది. స్వయం ఉపాధి కింద 2470 మంది లబ్ధిదారులకు రూ.26.42 కోట్ల రుణాలు ఇచ్చింది.
మంచిర్యాల జిల్లాలో..
మంచిర్యాల జిల్లా జనాభా 8,07,037 కాగా.. ఇందు లో షెడ్యూల్డ్ కులాల వారు 1,99,493(24.71 శాతం) ఉన్నారు. షెడ్యూల్డ్ కులాలవారీకి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నది. భూమిలేని నిరుపేద దళితుల కోసం దళితబస్తీ పథకం కింద ఉచితంగా మూడెకరాల భూమి ఇస్తున్నది. ఇప్పటి వరకు 128 కుటుంబాలకు 375.05 ఎకరాల భూమిని రూ.13.23 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసి అందజేసింది. బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధి, ఆదాయాభివృద్ధి పథకాల కింద 442 మందికి రూ.22.86 కోట్ల రుణాలు అందజేసింది. ఇందులో రూ.12.54 కోట్లు సబ్సిడీ కాగా, రూ.10.31 కోట్లు బ్యాం కు రుణంగా ఇచ్చారు. నాన్ బ్యాంక్ లింకేజీ పథకం కింద 234 మంది లబ్ధిదారులకు రూ.6.99 కోట్ల రుణం అందించారు. కాగా, ఇందులో రూ.6.70 కోట్ల సబ్సిడీ పొందారు. పైలట్ ప్రాజెక్టు పథకం కింద కూడా బ్యాంకు రుణాలు అందిస్తున్నది. ఈ స్కీం ద్వారా జిల్లాలోని 19 మందికి పందిరి కూరగాయల సాగు చేసుకునేందుకు ఒక్కొక్కరికి రూ.39.90 లక్షల సబ్సిడీ, బ్యాంకులోను రూ.26.60 లక్షల మొత్తం విలువల రూ.66.50 లక్షలు మంజూరయ్యిందని ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ హరినాథ్రెడ్డి తెలిపారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో..
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 81,596 ఎస్సీ జనాభా ఉంటుంది. ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల సహకార సంస్థ ద్వారా భూమి కొనుగోలు పథకం(దళితబస్తీ), బ్యాంకుల ద్వారా స్వయం ఉపాధికి రుణాలు అందిస్తున్నది. దళితబస్తీ పథకం ద్వారా 90 కుటుంబాలకు రూ.6.93 కోట్లతో 232.14 ఎకరాల భూమిని ఉచితంగా అందించింది. స్వయం ఉపాధి కోసం బ్యాంకు లింకేజీతో 311 మందికి రూ.3.94 కోట్లు, బ్యాంకు లింకేజీ లేకుండా వంద శాతం సబ్సిడీతో 11 మందికి రూ.22 లక్షలు అందించింది. ప్రభుత్వం తాజాగా ప్రకటించి దళిత బంధు ద్వారా ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలను అందించనుండడంపై దళితుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది.
చరిత్రలోనే అతి పెద్ద నిర్ణయం..
నిర్మల్ అర్బన్, జూలై 20: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2017లో వాహన రుణం పొందిన. నిరు ద్యోగులకు రుణాలను అందించి వారిని తమ కాళ్లపై నిలబడేలా కృషి చేయడం సంతోషం. ఇప్పుడు దళిత బంధు పథకం పెట్టి అందరికీ అండగా నిలవాల ని చరిత్రలోనే అతిపెద్ద నిర్ణయం తీసుకున్నరు. సీఎం కేసీఆర్తోనే మంచి చేసుడు అయితది. రైతులకు ఎంతో చేస్తున్నడు. నమ్ముకున్నోళ్లకు న్యాయం చేస్తున్నడు. ఇప్పుడు దళిత సమాజానికి నేనున్నా అంటూ తోడైండు. మా అభ్యున్నతికి ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు అభినందనీయం. -చిట్టి గణ ప్రసాద్, నిర్మల్
దేశం చూపు ఇటువైపు మళ్లడం ఖాయం..
నిర్మల్ అర్బన్, జూలై 20: రాష్ట్ర ప్రభుత్వం దళితుల జీవితాల్లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు త్వరలో ప్రారంభం కానున్న దళిత బంధు పథకంతో పేదలకు ఎంతో మేలు చేకూరుతుంది. అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్లే ప్రభుత్వాలు అందరి క్షేమాన్ని గుర్తిస్తాయి. ఈపథకాన్ని ప్రభుత్వం తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కోరే సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టారు. ప్రజలందరికీ మంచి చేయాలనే ఆయన నిత్యం శ్రమిస్తున్నడు. దళిత బంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలవబోతున్నది. దేశం మొత్తం ఈ పథకంతో తెలంగాణవైపు చూడడం ఖాయం.
-పడిగెల రవి, నిర్మల్
ప్రభుత్వ సాయంతోనే నిలబడ్డా..
నిర్మల్ అర్బన్, జూలై 20: నిరుద్యోగ యువకుల కు స్వయం ఉపాధిని అందించేందుకు మందుకు రావడంతో రుణాల కోసం దరఖాస్తు చేసుకు న్నా.. ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇప్పటికే రూ.2 లక్షల రుణం అందడంతో కిరాణం పెట్టుకున్నా. ఉద్యో గం లేకపోవడంతో ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయంతో ఉపాధి పొందుతున్నా. నాకు, నా కుటుంబానికి ఈ ప్రభుత్వం ఎంతో అండగా నిలిచింది. ఇప్పుడు దళిత బంధు పథకం ద్వారా దళితు లందరికీ అండగా నిలవడానికి నిర్ణయిం చడం ఓ మంచి ఆలోచన. గతంలో కనీసం దళిత సమాజాన్ని పట్టించు కున్న నా యకుడే లేడు. ఇయ్యాల సీఎం కేసీఆర్ దేవునోలే భరోసాని స్తున్నడు. ఆయన సల్లంగుండాలె.
-వెనుగంటి మిలింద్, నిర్మల్
ఆర్థిక భరోసా అభినందనీయం..
సీఎం కేసీఆర్ దళితబంధు ప్రకటించి, దళితుల్లో పేదలకు ఎంతో భరోసా కల్పించారు. ఈ పథకం ద్వారా ఒక్కో కుటుంబా నికి రూ.10 లక్షలు సాయం అంది స్తామనడం గొప్ప విషయం. దేశ చరిత్రలోనే తొలిసారి మన రాష్ట్రంలో ఇలాంటి పథకానికి రూపకల్పన చేయడం నిజంగా తెలంగాణ దళితుల అదృష్టంగా భావిం చాలి. దళితుల బాగు కోరి సీఎం కేసీఆర్ రూ. వేల కోట్లతో పథకం తీసుకురావడం సంతోషంగా ఉంది. రానున్న రోజుల్లో దళితులు అన్ని రంగాల్లో బాగుపడేందుకు ఈ అడుగు ఎంతో ఉపయోగపడనుంది.
-శైలేందర్ వాగ్మెరె, దళిత నాయకుడు
దళితుల ఆత్మబంధువు కేసీఆర్
సీఎం కేసీఆర్ దళితుల ఆత్మబంధువు. దళితబంధు పథకంతో దళితుల్లో పేదరికం పోయి ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. గత పాలకులు దళితులను పట్టించుకున్న పాపాన పోలేదు. దళితులపై ప్రత్యేక శ్రద్ధతో మూడెకరాల భూమి, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్. ఈ పథకంతో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. దళిత బిడ్డలమంతా ఆయనకు ఎంతో రుణపడి ఉంటాం.
కూలీ నుంచి రైతుగా మారా..
గ్రామంలో ఎన్నో ఏళ్ల నుంచి వ్యవసా య కూలీగా పనిచేసుకుంటూ ఉపాధి పొందుతున్నాం. ప్రభుత్వం 2017లో దళితబస్తీ కింద నాకు మూడెకరాల భూమి ఇచ్చింది. దీంతో పాటు పంట పెట్టుబడి సాయం కింద రూ. 84 వేలు అందజేసింది. దీంతో కూలీ పనులు చేసుకొనే పరిస్థితి నుంచి రైతుగా మారి, నా భూమిని నేను సాగు చేసుకుంటున్న. నాలుగేండ్లలో ప్రభుత్వం ఇచ్చిన భూమిలో రెండు పంటలు సాగు చేస్తున్నా. వానకాలంలో పత్తి, కంది పంటలు సాగు చేస్తున్నా. యాసంగిలో జొన్న, గోధుమ వస్తున్నది. రెండు పంటలకు ఖర్చులు పోగా, రూ.1 లక్ష వరకు ఆదాయం వస్తున్నది. దీంతో పాటు రైతుబంధు పథకం కింద రెండు పంటలకు గానూ రూ.30 వేలు వస్తున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం దళిత బంధు పథకం పెట్టి, దళితులందరికీ మంచి చేయాలని చూడడం బాగుంది.
సర్కారు సాయం ఎన్నటికీ మరువం..
కూలీ చేస్తేగాని పూట గడవని మాలాం టోళ్లకు సర్కారు చేస్తున్న సా యం ఎప్పటీకీ మరిచిపోలేము. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే నాకు నాలుగేళ్ల కిందట సర్కారు మూ డెకరాల భూమిని ఉచితంగా అందించింది. పంట పెట్టుబడి సాయం రూ.84 వేలు కూడా ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో రెండు పంటలు పండిస్తున్నా. అన్ని ఖర్చులు పోను ఏడాదికి రూ.1 లక్ష వరకు మిగులుతున్నది. మూడెకరాలకు రూ.30 వేల రైతుబంధు పైసలు వస్తున్నయి. కొన్ని డబ్బులు జమ చేసుకొని ఇంటి స్థలం కొనుక్కున్న. గతంలో ఇంతలా అండగా నిలిచిన సర్కారు ఒక్కటీ లేదు. మంచిజేసుడనేది ఒక్క సీఎం కేసీఆర్తోనే అయితది. ఆయన వెట్టిన దళిత బంధు పథకం కూడా సక్సెసయితది. చరిత్రల నిలిచిపోతది.