ఇచ్చోడ, జూలై 9 : రాష్ట్రంలోని రైతులు ఆత్మగౌరవంగా తలెత్తుకొని, గుండెనిబ్బరంతో బతికేలా సీఎం కేసీఆర్ భరోసానిచ్చారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టంచేశారు. పల్లె ప్రగతిలో భాగంగా ఇచ్చోడలో నిర్మించి రైతు వేదిక, పల్లె ప్రకృతి వనాన్ని శుక్రవారం ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి ఆయన ప్రారంభించారు. వనంలో మామిడి మొక్క నాటి, నీరు పోశారు. అనంతరం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో రైతు వేదికలు, రైతు బంధు, రైతు బీమా పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. పల్లె ప్రగతితో గ్రామాల రూపురేఖలు మారుతున్నాయన్నారు. అనంతరం జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ.. జిల్లాలో 101 రైతు వేదికలను పూర్తిచేసినట్లు చెప్పారు. రైతులు ఎదర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ఈ భవనాలు ఉపయోగపడుతాయన్నారు. ఈ కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, సర్పంచ్ చౌహాన్ సునీత, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి, ఆత్మ చైర్మన్ నరాల రవీందర్, మాజీ ఎంపీపీ సుభాష్ పాటిల్, ఎంపీటీసీల సంఘం జిల్లా అధ్యక్షుడు గాడ్గె సుభాష్, ఉప సర్పంచ్ లోక శిరీష్ రెడ్డి, అదనపు కలెక్టర్ డేవిడ్, డీఎఫ్వో చంద్రశేఖర్, మైనర్ ఇరిగేషన్ ఈఈ భీంరావ్, ఏడీ రమేశ్, ఎంపీడీవో వామనభట్ల రాంప్రసాద్, ఏడీఏ రాంకిషన్, ఆయా మండలాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, పీఏసీఎస్ చైర్మన్లు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, బోథ్ ఆత్మ చైర్మన్ల ప్రమాణ స్వీకారం..
వ్యవసాయ శాఖ ఇచ్చోడ, బోథ్ డివిజన్ల ఆత్మ చైర్మన్లు నరాల రవీందర్, మల్లెపూల సుభాష్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో మంత్రి అల్లోల సమక్షంలో ప్రమాణస్వీకారం చేశారు. రైతులకు అందుబాటులో ఉండాలని చైర్మన్లకు మంత్రి సూచించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ చైతన్యపర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ దేవానంద్, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు పాల్గొన్నారు.