కరోనా కాలంలోనూ సమర్థవంతంగా విధులు
జనానికి ధైర్యం చెబుతూ ముందుకు..
వైద్యసిబ్బందిని అభినందిస్తున్న ప్రజలు
ఆదిలాబాద్, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కరోనా సెకండ్ వేవ్(రెండో ఉధృతి) విజృంభిస్తున్నది. జిల్లాలు మహారాష్ట్రకు సరిహద్దు గా ఉండడంతో ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఫలితంగా రోజు దాదాపు 800లకుపైగా కేసులు నమోదవుతున్నాయి. వైద్యశాఖ సిబ్బంది ప్రాథమిక దశలోనే పాజిటివ్ కేసులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వైద్య సిబ్బంది నిత్యం ఏడు వేల మందికిపైగా ర్యా పిడ్ యాంటిజెన్ కిట్ల ద్వారా వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. జిల్లా దవాఖానలు, అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్సీల్లో పరీక్షలు చేస్తున్నారు. టెస్ట్ల సమయంలో వైరస్ తమకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పీపీఈ కిట్లు, మాస్క్లు, గ్లౌస్లు ధరించడం, గదులను శానిటైజ్ చేసుకోవడం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 300 మంది సిబ్బంది నిత్యం పర్సనల్ ప్రొటెక్టిక్ ఇక్విప్మెంట్(పీపీఈ) కిట్లు ధరించి కొవిడ్ పరీక్షలు చేస్తున్నారు.
ప్రతికూల పరిస్థితుల్లోనూ విధులు..
కొవిడ్ పరీక్షలు నిర్వహించేటప్పుడు సిబ్బంది పీపీఈ కిట్స్ ధరిస్తారు. ఈ కిట్లో డ్రెస్, మాస్క్, గ్లౌస్ ఉంటాయి. వీటిని వైద్య సిబ్బంది కొవిడ్ పరీక్షలు నిర్వహించేటప్పుడు తప్పకుండా ధరిస్తా రు. ఎందుకంటే దగ్గరగా ఉండి ముక్కులో నుం చి పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇవీ వైరస్ నుంచి రక్షణ కవచంలా ఉంటాయి. దాదాపు 3-5 గం టలపాటు వేసుకుని పరీక్షలు చేయాల్సి ఉంటుం ది. ప్రస్తుతం ఎండలు విపరీతంగా ఉండడం, ఉ ష్ణోగ్రతలు కూడా 40 డిగ్రీలకుపైగా నమోదుకావడం, వేడి అధికంగా ఉన్నప్పటికీ వారు మొక్కవోని ధైర్యంతో విధులు నిర్వర్తిస్తున్నారు. సర్కా రు పరీక్షలు చేయించుకోవాలని ప్రోత్సహిస్తుండడంతో జనం కూడా మొగ్గుచూపుతున్నారు. ఈ ఆపత్కాలంలో అధిక మంది వస్తున్నప్పటికీ ఓపికగా పరీక్షలు చేస్తున్నారు. వారికి భరోసానిస్తూ టెస్టులు చేయించుకుంటే మంచిదని, అందరూ చేయించుకునేలా ప్రోత్సహించాలని చెబుతున్నా రు. పరీక్షల్లో పాజిటివ్ వచ్చిన వారి దగ్గరకు వెళ్లి మందులు జాగ్రత్తగా వేసుకోవాలని, 14 రోజు ల్లో తగ్గిపోతుందనే జీవితంపై ఆశలు కల్పిస్తున్నారు. మనల్ని మనం రక్షించుకోవాలని, మన కుటుంబాన్ని, సమాజాన్ని కూడా రక్షించాల్సిన బాధ్యత మనదే అని ధైర్యం చెబుతున్నారు. వికలాంగులు, వృద్ధులకు ఎనలేని సేవ చేస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులను వీల్చైర్లలో తీసుకొచ్చి పరీక్షలు చేసిన తర్వాత ఇంటికి పంపిస్తున్నారు. వారి కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ పాజిటివ్ వచ్చిన వారిని బాగా చూసుకోవాలని, మంచి ఆహారం ఇవ్వాలని చెబుతున్నారు. మీరు ఎంత బాగా చూసుకుంటే అంత తొందరగా రికవరీ అవుతారనే విషయాలను తెలుపుతున్నారు. ఇటువంటి ఆపత్కాలం, కష్ట సమయంలో విధులు నిర్వర్తిస్తున్న వైద్య సిబ్బందిని మానవతామూర్తులు ప్రజలు అభివర్ణిస్తున్నారు. ఇబ్బందికర పరిస్థితుల్లో సేవ చేస్తున్న వైద్య సిబ్బందిని దేవుడికి ప్రతిరూపాలుగా భావిస్తున్నారు.