అసెంబ్లీలో ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
దస్తురాబాద్, మార్చి22 : దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెం గ్రామ పంచాయతీ సమీపంలో ఏర్పాటు చేసిన లక్ష మొ క్కల నర్సరీని పార్కుగా ఏర్పాటు చేసి సీఎం కేసీఆర్ పార్కుగా నామకరణం చేయాలని అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ ప్రస్తావించా రు. హరితహారం కార్యక్రమం గురించి అ సెంబ్లీ సమావేశాల్లో ఆమె మాట్లాడారు. ఆ దిలాబాద్ ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు 2015లో మొదటి విడుత హరితహారం కా ర్యక్రమంలో భాగంగా దస్తురాబాద్ మండలంలోని దేవునిగూడెంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో లక్ష మొక్కల నర్సరీని ఏర్పాటు చేశారన్నారు. స్వయంగా సీఎం కేసీఆర్ వచ్చి ఇక్కడే మొక్క నాటి హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు గుర్తు చేశారు. ఇటీవలే తాను, మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అక్కడికి వెళ్లి పరిశీలించామన్నారు. లక్ష మొక్కల నర్సరీ అడవి లాగా తయారైందని పేర్కొన్నారు. దీనికి పార్కును మంజూరు చేస్తే బాగుంటుందని, దానికి సీఎం కేసీఆర్ పేరు పెడితే తమ ప్రజలు కూడా చాలా సంతోషపడుతారని అన్నారు. మట్టి కోసం సర్పంచ్లు అటవీ ప్రాంతంలో కి వెళితే అటవీ శాఖ అధికారులు కేసులు పెడుతున్నారని, అలా పెట్టకుండా పర్మిషన్ ఇవ్వాలని కోరారు. అనంతరం మంత్రి ఐకే రెడ్డితో సీఎం కేసీఆర్ను కలిశారు. పెండింగ్ పనులను పరిష్కరించాలని కోరారు.
ప్రత్యేక నిధులు కేటాయించండి..
ఖానాపూర్ టౌన్, మార్చి 22: అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగుల పీఆర్సీ, ఫిట్మెంట్ ప్రకటించడాన్ని హర్షిస్తూ మంత్రి అల్లోలతో కలిసి సీఎం కేసీఆర్ను ఎమ్మెల్యే రేఖానాయక్ మర్యాద పూర్వకంగా కలిశారు. పుష్పగుచ్ఛం అందజేశారు. ఖానాపూర్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఇటీవల మృతిచెందిన ‘నమస్తే తెలంగాణ’ సీనియర్ రిపోర్టర్ కారింగుల రాంకిషన్ కుటుంబానికి సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సహాయం అం దించాలని కోరారు. దీనికి సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.