మల్టీ క్రాప్కే మొగ్గు చూపుతున్న జిల్లా రైతులు
సేంద్రియ ఎరువులతో వివిధ కూరగాయలు
తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి
ఆదర్శంగా నిలుస్తున్న రైతులు సతీశ్, రామన్న, మధుకర్
మంచిర్యాల జిల్లాలో రైతులు తమ రూటు మార్చారు. వరినే నమ్ముకోకుండా సేంద్రియ ఎరువుతో వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలు, పండ్ల తోటలను పెంచుతున్నారు. పట్టణాలకు ఎగుమతి చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం శివలింగాపూర్కు చెందిన గోనె సతీశ్ తొమ్మిది ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తూ రోజుకు రూ.2వేలకు పైగా ఆదాయం పొందుతున్నాడు. ఎర్రగుంటపల్లికి చెందిన దెబ్బ రామన్న తన చేనులో టమాటా, వంకాయ, కాకర, బెండ, మిర్చి, బీర, అల్చంత, చిక్కుడు కాయ, సోరకాయ, కాలీఫ్లవర్, కర్బూజవంటివి సాగు చేస్తున్నాడు. మల్చింగ్ చేసి, డ్రిప్ సాయంతో నీరందిస్తున్నాడు. చెన్నూర్ పట్టణానికి చెందిన మధుకర్ తన వ్యవసాయ పొలంలో మల్టీక్రాప్ పంటలు పండిస్తున్నాడు.
సేంద్రియ సాగు.. లాభాలు బాగు..
చెన్నూర్ మండలం ఎర్రగుంటపల్లికి చెందిన దెబ్బ రామన్న సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులతో కూరగాయలు పండిస్తున్నాడు. ఎకరంన్నర భూమిలో మామిడితోటతో పాటుగా అంతరపంటగా వివిధ రకాల కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఎరువులు స్వయంగా తయారు చేస్తూ, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు సాధిస్తున్నాడు.దెబ్బ రామన్న తనకున్న మూడున్నర ఎకరాల్లో రెండు ఎకరాల్లో వరి, మిగితా ఎకరంన్నరలో మామిడితోట పెంచుతూ కూరగాయలు పండిస్తున్నాడు. టమాట, వంకాయ, కాకర, బెండ, మిరప, బీర, అల్చంత, చి క్కుడు కాయ, సోరకాయ, కాలీఫ్లవర్, అల్చంత, కర్బూజ వంటి పంటలను సాగు చేస్తున్నాడు. సాగులో సేంద్రియ ఎరువులను మాత్రమే ఉపయోగిస్తున్నాడు. మొక్కలకు మధ్యలో గడ్డి మొలవకుండా మల్చింగ్, ఏర్పాటు చేసి డ్రిప్ సా యం తో నీటిని అందిస్తున్నాడు. జీవామృతాన్ని తోటవద్దే తయారు చేస్తాడు. ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పుట్టమట్టి, శనగ పిండిని, 200 లీటర్ల నీటిలో కలిపి మొక్కలకు అందిస్తున్నాడు. రెండు రోజులకోసారి కాకర 10 కి లోలు, వంకాయ 10 కిలోలు, క్యాలీఫ్లవర్ 10 కిలోలు, బీరకాయలు 5 కిలోల వరకు కాస్తున్నాయని, ప్రతినెలా రూ. 20 వేల దాకా ఆ దాయం వస్తుందని రైతు రామన్న చెబుతున్నాడు. ఇక మిగితా కూరగాయలు కూడా మరో నాలుగైదు రోజుల వరకు చేతికందుతాయని, ప్రస్తుతం పందిళ్లు వేయించినట్లు, కూరగాయల సాగును మరింతగా పెంచనున్నట్లు రామన్న తెలిపాడు.
సేంద్రియ ఎరువులతోనే సాగు
రైతులు సేంద్రియ ఎరువులను వాడి కూరగాయలను సాగు చేయాలి. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా జీ వామృతం మంచిగా పనిచేస్తుంది. ఇది ఇం డ్లు, పెరళ్లు, తోటలు, చేన్ల వద్దే తయారు చేసుకోవచ్చు. ఈ పంటలు ఆరోగ్యానికి మేలు. ఇప్పుడు చా లా మంది మల్టీక్రాప్కే మొగ్గుచూపుతున్నారు.
దెబ్బ రామన్న