ఇచ్చోడ, మే 11: మొక్కలతోనే మానవ మనుగడ సాధ్యమవుతుందని ఎంపీడీవో రాంప్రసాద్ పేర్కొన్నారు. మండలంలోని జామిడి, ఇచ్చోడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన వన నర్సరీ, పల్లె ప్రకృతి వనాలను మంగళవారం ఆయన పరిశీలించారు. నర్సరీలో పెంచుతున్న మొక్కలను పరిశీలించారు. ఏడో విడుత హరితహారంలో 3 లక్షల 32వేల మొక్కలు నాటడమే లక్ష్యమన్నారు. నర్సరీల్లో మొక్కలు పెరుగుతున్న తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీవో రమేశ్, జామిడి గ్రామ సర్పంచ్ సుభాష్, రామేశ్వర్, ఇచ్చోడ గ్రామ పంచాయతీ ఈవో నర్సారెడ్డి, సిబ్బంది ఉన్నారు.
మొక్కలను సంరక్షించాలి
హరితహారం నర్సరీల్లో పెంచుతున్న మొక్కలను సంరక్షించాలని ఎంపీడీవో తిరుమల ఈజీఎస్ సిబ్బందికి సూచించారు. మండలంలోని మత్తడిగూడ గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీని పరిశీలించారు. ఆమె వెంట సర్పంచ్ యశోద, ఈవో సత్యనారాయణ, తిరుపతి ఉన్నారు.
నర్సరీలో మొక్కల పెంపకం భేష్
నర్సరీలో మొక్కల పెంపకం సంతృప్తిగా ఉందని ఈజీఎస్ ఈసీ విజేశ్ అన్నారు. ఉమ్రి గ్రామంలో ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కల పెంపకాన్ని పరిశీలించారు. మొక్కలను సంరక్షించాలని పంచాయతీ సిబ్బందికి సూచించారు. ఆయన వెంట ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్ వికాస్చౌహాన్ ఉన్నారు.