ఆదిలాబాద్ రూరల్, మే 11: ఆదిలాబాద్ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొ న్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని నీలానగర్, పాత హౌసింగ్ బోర్డులో రూ.20 లక్షలు, శాంతినగర్లో రూ.30 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు, భీంసరి శ్మశాన వాటికలో పలు అభివృద్ధి పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెలా పట్టణ ప్రగతి కింద సుమారు రూ.1.20 కోట్ల నిధులు వస్తున్నాయని, వీటితో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించామన్నారు. శ్మశాన వాటికల అభివృద్ధికి రా్రష్ట్ర ప్రభు త్వం భారీగా నిధులు మంజూరు చేసిందని పేర్కొన్నారు. పట్టణంలోని 49 వార్డుల అభివృద్ధికి మున్సిపల్ నిధులతోపాటు పట్టణ ప్రగతి, ఎస్డీఎఫ్ నిధుల ద్వారా సీసీ రోడ్లు, డ్రైనేజీలను నిర్మిస్తున్నామన్నారు. పట్టణంలోని ప్రజలకు మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. పట్టణంలోని ప్రతి ఇంటికీ తాగునీరందించేందుకు మిషన్ భగీరథ పైప్లైన్లు వేయించామని చెప్పారు. మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, కమిషనర్ శైలజ, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, వైస్ చైర్మన్ జహీర్ రంజానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, కౌన్సిలర్లు అశోక్, అజయ్, ప్రకాశ్, కొండ మీన, గణేశ్, చందా నర్సింగ్, నాయకులు యూనిస్ అక్బానీ, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.