ధరించకుంటే రూ.1000 జరిమానా
పోలీస్ అధికారులకు ఆదేశాలు
నేటి నుంచి అమలు
మంచిర్యాల(నమస్తే తెలంగాణ)/ఎదులాపురం, ఏప్రిల్ 11 : ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని, లేకుంటే జరిమానా విధించాలని రామగుండం సీపీ సత్యనారాయణ, ఆదిలాబాద్ ఇన్చార్జి ఎస్పీ రాజేశ్చంద్ర పోలీస్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం జీవో నంబర్ 82 జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మాస్కులు పెట్టుకోని వారిపై సెక్షన్ 51 నుంచి 60 డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 205, సెక్షన్ 188 ప్రకారం చట్టరీత్యా శిక్షకు అర్హులవుతారని పేర్కొంది. మాస్కు పెట్టుకోకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగే వారికి పోలీస్ వారు ఈ చలాన్ ద్వారా రూ.1000 జరిమానా విధిస్తారని స్పష్టం చేసింది. ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలు అప్రమత్తంగా ఉండి మాస్కులు ధరించని వారిపై జరిమానా విధిస్తారని పే ర్కొంది. ప్రజలందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించి, భౌతిక దూ రాన్ని పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని పోలీస్ వారు విజ్ఞప్తి చేస్తున్నారు.