కమలనాథుల ఆధ్వర్యంలో పట్టాల కోసం రైతుల దీక్ష
విరమించాలని అటవీ, పోలీసుఅధికారుల విజ్ఞప్తి
అర్ధరాత్రి పోలీసుల కండ్లలో కారం చల్లిన నేతలు
మహిళా కానిస్టేబుళ్లపై దాడి.. నలుగురికి తీవ్ర గాయాలు..
పట్టాలు ఇచ్చే అవకాశం లేదు.. : జిల్లా అటవీ శాఖ అధికారి
కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/పెంచికల్పే ట్, ఏప్రిల్ 10 : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట మండలంలోని కొండపల్లి గ్రామానికి చెందిన గిరిజను లు, గిరిజనేతరలు దశాబ్దాలుగా దాదాపు 75 హెక్టార్లలో పో డు వ్యవసాయం చేసుకుంటున్నారు. పట్టాలు ఇవ్వాలని డి మాండ్ చేస్తూ గురువారం తమ చేలలోనే ధర్నాకు దిగారు. బీజేపీ నాయకులు పాల్వాయి హరీశ్బాబు మద్దతుతో ధర్నా కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం పోలీసులు, అటవీశాఖ అధికారులు ధర్నా విరమింపజేయాలని విజ్ఞప్తి చేశారు. అయినా పట్టించుకోకుండా దీక్ష కొనసాగించారు. అర్ధరాత్రి డీఎఫ్వో శాంతారం, ఏఎస్పీ వైవీఎస్ సు ధీంద్ర పోలీసు బలగాలతో దీక్షాస్థలికి చేరుకొని మీ హామీలు నెరవేర్చే ప్రయత్నం చేస్తామని చెప్పారు. అయినప్పటికీ వినకుండా కొనసాగించారు. పోలీసులు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వీరిని అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. దీం తో కొందరు నాయకులు రైతులను రెచ్చగొట్టడంతో ఎ దురుదాడికి దిగారని స్థానిక ఎస్ఐ రమేశ్ తెలిపారు. ఈ దా డుల్లో కాగజ్నగర్ రూరల్ సీఐ రాజేందర్, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు తిరుపతిబాయి, కోమలి.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లు ఫరీద్, దీపక్కు గాయాలయ్యాయి. రైతులు, బీజేపీ నాయకులను అరెస్టు చేసి వాహనాల్లో ఎక్కించే క్రమంలో పోలీసులపై గుర్తు తెలియని వ్యక్తులు కారం చల్లారని పేర్కొన్నారు. అయినా అరెస్టు చేసి వాహనాల్లో తరలించే క్రమం లో రెబ్బెన గ్రామ సమీపంలో గ్రామస్తులు వాహనాలకు అ డ్డు తిరిగి వాహనాలను ధ్వంసం చేసి బీజేపీ నాయకులను తప్పించారని తెలిపారు. వాహనాలను ధ్వంసం చేసి దాడికి పాల్పడిన వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్ఐ రమేశ్ తెలిపారు. కాగా.. దీక్షని పోలీసులు భగ్నం చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ నాయకుడు హరీశ్బాబు బెజ్జూర్ మండలంలోని రెబ్బన గ్రామంలోని తన నివాసంలో నిరాహార దీక్ష చేపట్టారు.
75 హెక్టార్ల అటవీ భూమి గిరిజనేతరుల సాగులోనే..
కొండపల్లిలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని బీజేపీ నాయకుల ప్రోత్సాహంతో చేపట్టిన ధర్నా జఠిలమైన సమస్యగా మారుతున్నది. బీజేపీ నాయకులు అత్యుత్సాహంతో అమాయక రైతులు బలికావాల్సి వస్తున్నది. కొండపల్లి అట వీ ప్రాంతంలో సుమారు 75 హెక్టార్ల అటవీ భూమిలో పదే ళ్ల నుంచి గిరిజనులు, గిరిజనేతరులు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. వీరిలో గిరిజనులు తక్కువ సంఖ్యలో ఉండగా.. అధిక సంఖ్యలో గిరిజనేతరులు ఉన్నారు. అటవీ అధికారుల సమాచారం మేరకు కొండపల్లి అటవీ ప్రాంతం లో పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారిలో గిరిజన రైతులు ఒక్కరు కూడా లేరు. ప్రస్తుతం 75 హెక్టార్ల అటవీ భూమిలో సాగు చేసుకుంటున్న వారిలో ఇద్దరు ఎస్సీ రైతు లు ఉండగా.. మిగతా వారందరూ బీసీ కేటగిరీకి చెందిన వారు ఉన్నట్లు అటవీ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం వీరికి పట్టాలు ఇచ్చే అవకాశం లేదు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ నాయకులు రా ద్ధాంతం చేస్తున్నారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కొండపల్లి వద్ద చేపట్టిన దీక్షలో రైతులు పది మంది ఉంటే బీజేపీ నాయకులు రెండు వందల మందికి పైగా ఉన్నారు. పట్టాలపై రైతుల్లో లేనిపోని ఆశలు కల్పించి, రైతులను రెచ్చగొట్టి కావాలని దీక్ష చేయిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 కంటే ముం దు నుంచి పోడు వ్యవసాయం చేసుకునే గిరిజన రైతులకు అటవీ హక్కు పత్రాలు ఇచ్చేందుకు అవకాశం ఉంది. కానీ.. కొండపల్లి అటవీ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారిలో గిరిజనేతర రైతులే అధికంగా ఉండడంతో పట్టాలు కావడం లేదు. బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధికోసం చేస్తున్న నాటకంలో రైతులను పావులుగా వాడుకుంటున్నారు.
చర్చలు విఫలం
బెజ్జూర్, ఏప్రిల్ 10 : మండలంలోని రెబ్బన గ్రామంలో బీజేపీ నాయకుడు హరీశ్బాబు చేస్తున్న దీక్షా శిబిరం వద్ద ఆయనతో జిల్లా అటవీశాఖ అధికారి శాంతారాం, డీసీపీ ఆ పరేషన్ రామగుండం శరత్ చంద్రపవార్, అదనపు ఎస్పీలు వైవీఎస్ సుధీంద్ర, అచ్చేశ్వర్రావు, ఏఎస్పీ బాలస్వామి చర్చలు జరిపారు. ఈ ఒక్క ఏడాది మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిలిపి వేయాలని, రైతులు సాగు చేసుకునే అవకా శం కల్పించాలని హరీశ్బాబు పేర్కొన్నాడు. ఇందుకు అధికారులు ఒప్పుకోకపోవడంతో చర్యలు విఫలమయ్యాయి. ఈ కార్యక్రమంలో కాగజ్నగర్ ఎఫ్డీవో విజయ్కుమార్, కౌటాల సీఐ స్వామి, కాగజ్గనర్ సీఐ మోహన్, ఎస్ఐలు సాగర్, రామారావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఫౌడేల్, నాయకులు రైతులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
చెన్నైకి చుక్కలు చూపిస్తున్న పృథ్వీ షా, ధావన్
కొవిడ్ టీకాలు పంపండి.. కేంద్రానికి సీఎస్ సోమేశ్ కుమార్ లేఖ