కేంద్రాలను ముంచెత్తనున్న వడ్లు
కనీవినీ ఎరుగని రీతిలో సంపద
రైతున్నకు ఆర్థిక దన్నుగా సేద్యం సొమ్ములు
మంచిర్యాల జిల్లాలో రికార్డుస్థాయిలో దిగుబడి
మూడేండ్లలో గణనీయంగా పెరిగిన సాగు విస్తీర్ణం
అన్నదాత మోములో ఆనందకాంతులు
ఆదిలాబాద్, ఏప్రిల్ 7(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా యాసంగిలో వరి అధిక విస్తీర్ణంలో సాగవుతున్నది. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, మిషన్ కాకతీయలో భాగంగా చెరువుల పూడికతీత, కాలువల మరమ్మతులు, ప్రాజెక్టుల ఆధునీకరణ, రైతుబీమా, రైతుబంధు, సబ్సిడీపై పరికరాలు ఇవ్వడంతో యేటా సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. ఈ యేడాది 2,18,915 ఎకరాల్లో వరి రెండో పంటగా సాగైంది. ఇందులో మంచిర్యాల జిల్లాలో 1,10,815 లక్షలు, నిర్మల్లో 90 వేలు, కుమ్రం భీం ఆసిఫాబాద్లో 15,600, ఆదిలాబాద్లో 250 ఎకరాల్లో సాగవుతున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 3,99,537 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. మంచిర్యాల జిల్లాలో వరి పొట్ట దశలో ఉండగా.. మరో పది రోజుల్లో కోతకు రానుంది. పంట కొనుగోళ్లపై రైతుల్లో ఆందోళన నెలకొనగా.. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ కొనుగోళ్లను గ్రామాల్లోనే చేపట్టాలని అధికారులను ఆదేశించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకంటే ఏం కావాలి
లక్ష్మణచాంద, ఏప్రిల్ 7 : కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులు మస్తు సంతోషంగా ఉన్నరు. రైతు బీమాతో భరోసానిచ్చారు. పంటలకు పెట్టుబడి సాయం చేస్తున్నరు. పంటలకు మద్దతు ధర ఇస్తున్నరు. రైతులకోసం అన్నీ చేస్తున్నరు. ఇగ మాకు ఇంతకంటే ఏం కావాలి. ఈయన ఉన్నంత కాలం మాకు ఎలాంటి ఢోకా లేదు.
బుర్రి కవిత, పీచర
ఇవి కూడా చదవండి..
70 ఏండ్ల తర్వాత అమర సైనికుడి భార్యకు పెన్షన్
మంగళూరు ఎయిర్పోర్టులో 2.8 కేజీల బంగారం సీజ్