డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్
పూత్లీబౌలి పీహెచ్సీ తనిఖీ
ఎదులాపురం, ఏప్రిల్ 5: జాగ్రత్తలు పాటిస్తూ కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ సూచించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పూత్లీబౌలి పీహెచ్సీలో డీఎంహెచ్వో, డీఎస్వోలు తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పీహెచ్సీల్లో ఆర్టీపీసీఆర్ కొవిడ్ నిర్ధారణ పరీక్షల తీరును పరిశీలించారు. నూతన ఆన్లైన్ పోర్టల్లో అనుమానితుల పేరు, వివరాలు ఎలా నమోదు చేయాలో డీఎస్వో వైసీ. శ్రీనివాస్ తెలిపారు. అనంతరం డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ, జిల్లా వ్యాప్తంగా ఎక్కడి నుంచి వచ్చినా పీహెచ్సీల్లో కరోనా నిర్థారణ పరీక్షలు చేయాలన్నారు. మెడికల్ ఆఫీసర్ వినోద్ కుమార్, సీవో నవీన్ కుమార్, స్టాఫ్ నర్సు లీల, అకౌంటెంట్ శృతి, ఫార్మాసిస్ట్ తేజ తదితరులున్నారు.
మెరుగైన వైద్య సేవలందించాలి
దస్తురాబాద్, ఏప్రిల్ 5 : మారుమూల గ్రామాల నుంచి వచ్చే ప్రజల కు మెరుగైన వైద్య సేవలందించాలని జిల్లా వైద్య అధికారి ధన్రాజ్ సూచించారు. సోమవారం మండల కేంద్రంలోని పీహెచ్సీ కేంద్రాన్ని డిప్యూటీ డీఎంహెచ్వో శ్రీకాంత్తో కలిసి తనిఖీ చేసి, వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. కొవిడ్ టీకా వేసుకొని పరిశీలన గదిలో ఉన్న వారితో సంభాషించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పీహెచ్సీలో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని కిరణ్మయిని ఆదేశించారు. కొవిడ్ టీకా సురక్షితమని ప్రజలందరూ టీకా వేసుకునేందుకు ముందుకు రావాలని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 2 నుంచి 3 లక్షల మందికి కొవిడ్ టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పీహెచ్సీలో రోజుకు 150 నుంచి 200 మందికి కొవిడ్ వ్యాక్సిన్ వేసి టీకాల సంఖ్యను పెంచాలని ఆదేశించారు. ఆయన వెంట ఇన్చార్జి డాక్టర్ సుధాకర్, హెచ్ఈవో వేణుగోపాల్, హెచ్వీ గంగుబాయి, స్టాఫ్నర్స్ లక్ష్మీప్రసన్న, ఏఎన్ంలు జ్యోతి, హెల్త్ అసిస్టెంట్లు రవి, మల్లేశ్, మధు, రాజేందర్, ఆశ కార్యకర్తలు, సిబ్బంది నర్సయ్య, గౌరవ్వ పాల్గొన్నారు.