ఆదిలాబాద్, ఏప్రిల్ 3 ( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది రోజులుగా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తున్నది. గత నెలలో రెండో వారం వరకు 25 నుంచి 30 పాజిటివ్ కేసులు నమోదు కాగా , పది రోజులుగా రోజుకు సగటున 200 కేసుల వరకు నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో 40 నుంచి 70 మధ్య కేసుల సంఖ్య ఉండగా, కుమ్రం భీ ఆసిఫాబాద్ జిల్లాలో తక్కువగానే ఉంటున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 1700 యాక్టివ్ కేసులు ఉన్నాయి. చాలామందికి ఎలాంటి లక్షణాలు లేకున్నా కొవిడ్ నిర్ధారణ అవుతున్నది. అధికారులు కూడా నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారు. రోజు 5 వేల మందికి ర్యాపిడ్ కిట్ల ద్వారా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కరోనా వారియర్స్, 60 ఏళ్లు దాటిన వారికి 45 సంవత్సరాలు దాటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి టీకా వేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 45 సంవత్సరాలు దాటిన వారికి జిల్లా దవాఖానలతో పాటు పట్టణ, ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్ వేస్తున్నారు.
విస్తృతంగా అవగాహన
వైరస్ నియంత్రణకు అధికారులు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. వైద్యశాఖ, పోలీసు, మున్సిపల్, పంచాయతీ సిబ్బంది పట్టణాలు, గ్రామాల్లో ప్రజలకు కరోనా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు. మాస్కు తప్పనిసరి ధరించాలని ఆదిలాబాద్లో పోలీసుల ఆధ్వర్యంలో ర్యాలీలు, పోస్టర్ల ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నా రు. జిల్లా వైద్యాధికారి, సిబ్బంది, పోలీసులు ద్విచక్ర వాహనదారులకు మాస్కులు పంపిణీ చేశారు. ఉమ్మడి జిల్లాకు సరిహద్దున మహారాష్ట్ర ఉండడం అక్కడ కరోనా ప్రభావం అధికంగా ఉండడంతో సరిహద్దు గ్రామస్తులు మహారాష్ట్ర వెళ్లవద్దని సూచిస్తున్నారు. ఒకవేళ వెళ్లివచ్చిన వారు ఉంటే హోం ఐసోలేషన్లో ఉండేలా సర్పంచ్లు చూడాలని కోరుతున్నారు. మాస్కు ధరించని వారు బహిరంగ ప్రదేశాల్లో తి రిగితే డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని రూ.1000 జరిమానా విధిస్తామని పోలీసులు సూచిస్తున్నారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికులు అందరూ మాస్కు ధరించేలా చూడాలని అధికారులు కోరుతున్నారు.
ఇవి కూడా చూడండి..
ఫ్రిజ్లో వీటిని అసలు పెట్టకూడదు.. ఎందుకో తెలుసా?