మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 2 : మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా గుడ్ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. మంచిర్యాల పట్టణంతో పాటు ఆయా చోట్ల చర్చిల్లో పాస్టర్లు ఏసు సందేశాన్ని వినిపించారు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే ఏసు మరణించిన మూడోరోజు పునరుత్థానుడై లోకానికి శుభ సందేశమందించాడు. దానిని ఈస్టర్గా ఆదివారం జరుపుకోనున్నారు.
కల్వరీ చర్చిలో..
సోమగూడెం, బెల్లంపల్లి రహదారిలోని కల్వరీ మినిస్ట్రీస్ చర్చిలో గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. కొవిడ్-19 నిబంధనల ప్రకారం తక్కువ సంఖ్యలో క్రైస్తవులు హాజరవగా, ఆన్లైన్ ద్వారా ప్రార్థనలు చేశారు. యూ ట్యూబ్, ఆన్ లైన్ ద్వారా ఉదయం 7 గంటల నుంచి 9:30 గంటల వరకు కల్వరీ మినిస్ట్రీస్ నిర్వాహకురాలు సిస్టర్ షారోన్ సందేశం వినిపించారు. ఈ లైవ్ గుడ్ ఫ్రైడే వేడుకల్లో సుమారు 15 వేల మంది పాల్గొన్నట్లు నిర్వాహకులు తెలిపారు.
సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 2 : సీసీసీ నస్పూర్లో గుడ్ఫ్రైడే వేడుకలను క్రైస్తవులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సీసీసీ నస్పూర్లోని చర్చిలకు క్రైస్తవులు చేరుకొని, ప్రార్థనలు చేశారు. కొవిడ్-19 నిబంధనలు పాటిస్తూ పాల్గొన్నారు. ఆరేళ్లలోపు పిల్లలు, 65 ఏండ్లు పైబడినవారిని అనుమతించలేదు. చర్చిలో పలు ఆరాధనలు నిర్వహించినట్లు ఫాదర్ విజయ్కుమార్ తెలిపారు.