మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు
రోడ్డు మరమ్మతు పనులు ప్రారంభం
మంచిర్యాల అర్బన్(హాజీపూర్), ఏప్రిల్ 2: తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నదని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పేర్కొన్నారు. మండలంలోని టీకనపల్లి నుంచి పెద్దంపేట వరకు గల బీటీ రోడ్డు మరమ్మతు పనులను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రూ.1.23 కోట్ల ఆర్అండ్బీ నిధులతో ఐదున్నర కిలో మీటర్ల బీటీ రోడ్డు వేయనున్నట్లు తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు. హాజీపూర్లోని పల్లె ప్రకృతి వనం, నర్సరీలను పరిశీలించారు. హాజీపూర్ పీహెచ్సీలో 45 ఏండ్లు పైబడిన వారికి ఏర్పాటు చేసిన కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. కార్యక్రమాల్లో ఎంపీపీ మందపల్లి స్వర్ణలత, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మొగిలి శ్రీనివాస్, సర్పంచ్ రాంటెంకి మల్లేశ్వరి, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు పూస్కూరి శ్రీనివాస్రావు, పీఏసీఎస్ చైర్మన్లు సందెల వెంకటేశ్, మల్రాజు రామారావు, కొట్టె సత్తయ్య, సర్పంచులు గోళ్ల శ్రీనివాస్, మంచాల శ్రీనివాస్, జాడి సత్యం, ఎంపీటీసీ సోగల సుజాత, ఉప సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు జితేందర్రావు, యూత్ అధ్యక్షుడు దొమ్మటి బాపు, అల్లంల నాగయ్య తదితరులు పాల్గొన్నారు.