బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ
బోథ్, ఏప్రిల్ 2: పేద ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలు వరంలాంటివని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు పేర్కొన్నారు. మండల కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 17 గ్రామాలకు చెందిన 31 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, ముగ్గురికి షాదీముబారక్ కింద మంజూరైన రూ. 34,03,944 విలువైన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లికి సాయం అందించడానికి సీఎం కేసీఆర్ ఈ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సురేందర్యాదవ్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాహెర్ బిన్ సలాం, ఏఎంసీ చైర్మన్ డీ భోజన్న, వైస్చైర్మన్ జీ భాస్కర్రెడ్డి, వైస్ఎంపీపీ రాథోడ్ లింబాజీ, టీఆర్ఎస్ నాయకులు ఉమేశ్, దేవేందర్, రాజు, గంగారెడ్డి, మురళి, సురేశ్, ఆర్ఐ దశరథ్, తదితరులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, ఏప్రిల్ 2: మండలంలోని ముక్రా(కే), అడెగామ(బీ), ఇచ్చోడ, కోకస్మన్నూర్, మల్యాల గ్రామాలకు చెందిన తొమ్మిది మంది లబ్ధిదారులకు శుక్రవారం ఆదిలాబాద్లో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ జాదవ్ రామారావు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ శ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ సుభద్రబాయి, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, ఎంపీటీసీ సుభాష్, నిమ్మల శివకుమార్ రెడ్డి, ఉపసర్పంచ్ లోక శిరీష్ రెడ్డి, దాసరి భాస్కర్, ప్రవీణ్, భీముడు పాల్గొన్నారు.
చలివేంద్రం ప్రారంభం
బోథ్, ఏప్రిల్ 2: మండల కేంద్రంలోని బస్టాండ్లో మాసం లక్ష్మి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ప్రారంభించారు. కార్యక్రమంలో బోథ్ సీఐ నైలు, ఎస్ఐ రాజు, వీడీసీ చైర్మన్ గంగాధర్, నాయకులు శ్రీధర్రెడ్డి, రాజు, శ్రీనివాస్, కంట్రోల్ సాయన్న, కుటుంబ సభ్యులు నారాయణ, అనిల్, సొసైటీ సభ్యులు నరేశ్, శివ, ప్రమోద్, బిక్క లక్ష్మణ్, అరవింద్ పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి
నేరడిగొండ, ఏప్రిల్ 2 : కిష్టాపూర్ గ్రామ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు హామీ ఇచ్చారు. కిష్టాపూర్ గ్రామాన్ని ఆయన సందర్శించారు. సర్పంచ్ సోలంకి గీత గ్రామ సమస్యలు ఎమ్మెల్యేకు విన్నవించారు. గ్రామంలో చాలా మంది పేద ప్రజలకు ఇళ్లు లేక పాకల్లో జీవనం సాగిస్తున్నారని చెప్పారు. అలాంటి వారికి డబుల్బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని, జాతీయ రహదారి నుంచి గ్రామం వరకు రోడ్డు నిర్మించాలని కోరారు. గ్రామంలోని సమస్యలు పరిష్కరించే దిశగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం సర్పంచ్ గీత, గ్రామ పెద్దలు ఎమ్మెల్యేను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ దావుల భోజన్న, వైస్చైర్మన్ భాస్కర్రెడ్డి, గ్రామ పెద్దలు కరణ్సింగ్, ప్రతాప్సింగ్, కిషన్సింగ్ పాల్గొన్నారు.