ఈ యేడాది మంచిర్యాల జిల్లాకు కేటాయింపు
గతేడాదికంటే పెరిగిన పంటల రుణం
రైతులను ఇబ్బందులు పెట్టవద్దంటూ బ్యాంకర్లకు ఆదేశాలు
మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 1 : రైతులకు పెట్టుబడులు భారం కాకుండా ఈ ఏడాది ప్రభుత్వం రుణ లక్ష్యాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే రైతులకు రుణాలు ఇచ్చే సమయంలో ఎలాంటి ఇబ్బందులకు గురి చే యవద్దని బ్యాంకర్లను ఆదేశించింది. మరోవైపు పంట పెట్టుబడి కోసం ప్రైవేట్ వడ్డీ వ్యాపారు లను ఆశ్రయించి వేలకు వేలు మిత్తీలు చెల్లించ కుండా ఉండేందుకు ముందస్తుగానే రైతు బం ధు పథకం కింద ఎకరానికి రూ. ఐదు వేలు చెల్లి స్తున్నది. పంట పొలాలను తనాఖా పెట్టుకొని రుణం ఇచ్చే బ్యాంకులకు రుణ పరిమితి పెంచి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
పెరిగిన రుణ లక్ష్యం..
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను పం టల సాగుకు అనుకూలంగా జిల్లా యంత్రాం గం రుణ ప్రణాళిక ఖరారు చేసింది. ఈ ఏడాది రూ. 3192.74 కోట్ల రుణాలను జిల్లాలోని రైతాంగానికి, ఇతర వ్యాపారులకు, ఇండ్లు, విద్యా తదితర రుణాలకు అందజేయడమే లక్ష్యంగా బ్యాంకర్లు నిర్దేశించుకున్నారు. ఇందు లో రూ. 2029.68 కోట్లు వ్యవసాయానికి కేటాయించగా, పంటల రుణాల కోసం రూ. 1713. 51కోట్లు రైతులకు పంటల రుణ లక్ష్యం గా నిర్దేశించారు. అగ్రికల్చర్ టర్మ్లోన్లు 316. 17 కోట్లు ఇస్తున్నట్లు యాక్షన్ ప్లాన్లో పేర్కొన్నారు. చెరువుల పూడికతీత, ప్రాజెక్టులు, ఎత్తి పోతల పథకాల వల్ల సాగు విస్తీర్ణం పెరుగుతుండడంతో రుణ లక్ష్యాన్ని పెంచుతూ వస్తున్నారు. కాగా రైతులకు వ్యవసాయ పంట రుణాలు అందజేసేందుకు జిల్లా ప్రణాళిక తయారు చేశామని లీడ్ బ్యాంకు మేనేజర్ హవేలి రాజు పేర్కొన్నారు. రైతులు సద్వినియోగం చేసుకో వాలని ఆయన సూచించారు.