ఆసిఫాబాద్ : ఏజెన్సీ ప్రాంతాల్లో జనాభా ప్రతిపదికనకాకుండా అదనపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఆత్రం సక్కు కోరారు. గురువారం అసెంబ్లీ సమావేశం జీరో అవర్లో ఎమ్మెల్యే పలు సమస్యలను స్పీకర్ దృష్టికి తీసుకువచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన గ్రామాలు సుదూర ప్రాంతంలో ఉంటాయని వైద్య సౌకర్యాన్ని మరింత మెరుగు పరిచేందుకు జనాభాతో సంబంధం లేకుండా పీహెచ్సీలను మంజూరు చేయాలన్నారు.
ప్రజలకు వైద్య సేవాలందిస్తున్న రెండవ ఏఎన్ఎంలు,ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత మంత్రిని కోరారు.