ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్ : పర్యాటక స్థలాల ప్రాముఖ్యతను తెలిపేలా విద్యార్థులకు విజ్ఞాన,విహార యాత్రలు ఎంతగానో దోహదపడుతాయని ఆసిఫాబాద్ కలెక్టర్ రాల్రాజ్ అన్నారు. శనివారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా జిల్లాలోని జైనూర్, ఆసిఫాబాద్ రెబ్బెన , కాగజ్నగర్ నుంచి బస్సులు ఏర్పాటు చేసి కొమురం భీం జోడేఘాట్ , ఎన్.టీ.ఆర్ సాగర్, కొమురం భీం ప్రాజెక్టులను సందర్శించేలా జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో క్షేత్ర పర్యటనను అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవికృష్ణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చారిత్రక ప్రదేశాల గురించి పూర్తి అవగాహన కల్పించేందుకు పర్యటన ఏర్పాటు చేశామని తెలిపారు. ఇందులో 178 మంది విద్యార్థులు, 24 మంది ఉపాధ్యాయులు హాజరయ్యరని తెలిపారు. ఈ కార్యక్రమమంలో వివిధ శాఖల అధికారులు ఉన్నారు.