కోటపల్లి, అక్టోబర్ 28 : గంజాయి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని చెన్నూర్ రూరల్ సీఐ నాగరాజు పిలుపునిచ్చారు. కోటపల్లి మండలంలోని దేవులవాడ గ్రామంలో గంజాయి తాగడంతో కలిగే అనర్థాలపై ఎస్ఐ రవికుమార్తో కలిసి బుధవారం రాత్రి గ్రామస్తులకు అవగాహన కల్పించారు. గంజాయి సాగు, రవాణా, విక్రయం, తాగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి సాగు చేసే గ్రామాలపై నిఘా ఉంచుతున్నామని తెలిపారు. గ్రామంలో ఎవరివద్దనైనా గంజాయి కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆన్లైన్ జరిగే మోసా లు, పేకాట, కోడి పందేలతో కలిగే నష్టాలపై, రోడ్డు భద్రతా నియమాల పై అవగాహన కల్పించారు. యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలని, సన్మార్గంలో నడుచుకోవాలని సూచించారు. అనంతరం యువకులకు పోలీస్ శాఖ తరఫున వాలీబాల్ కిట్ను సీఐ, ఎస్ఐ అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ రమేశ్, గ్రామ నాయకులు గాదె శ్రీనివాస్, నరసింహులు, సీతారాంరెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.
గంజాయి సేవిస్తే కఠిన చర్యలు
వేమనపల్లి, అక్టోబర్ 28 : గ్రామాల్లో ఎవరైనా గంజాయి రవాణా చేసినా, విక్రయించినా, తాగినా కఠిన చర్యలు తీసుకుంటామని చెన్నూరు రూరల్ సీఐ నాగరాజు హెచ్చరించారు. గురువారం వేమనపల్లిలో గంజాయి వల్ల కలిగే అనర్థాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గంజాయి వాడడంతో కలిగే నష్టాలను వివరించారు. వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు సాధించాలని యువకులకు సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించాలన్నారు. అనంతరం గ్రామంలోని యువకులకు వాలీబాల్ కిట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో నీల్వాయి ఎస్ఐ రహీంపాషా, సర్పంచ్ కుబిడె మధూకర్, గ్రామస్తులు, యువకులు పాల్గొన్నారు.