నార్నూర్, అక్టోబర్ 28 : ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. గంగాపూర్లో గురువారం జగదాంబాదేవి, సేవా లాల్ మహరాజ్ మందిర ప్రారంభోత్సవ కార్య క్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆల యంలో విగ్రహాలు, కలశాన్ని ప్రతిష్ఠించారు. ఈ కార్యక్ర మానికి జడ్పీ చైర్మన్ ముఖ్య అతిథిగా హాజర య్యారు. ఆలయంలో సంప్రదాయ పూజలు చేశారు. సాంస్కృతిక నృత్యాలు ఆక ట్టుకున్నాయి.
అభివృద్ధి పనులు భేష్
నార్నూర్లో చేపట్టిన అభివృద్ధి పనులు బాగు ఉన్నాయని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొ న్నారు. గురువారం నార్నూర్ మండల కేంద్రం లోని పలు వార్డుల్లో నిర్మిస్తున్న డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణ పనులు పరిశీలించారు.
మెరుగైన వైద్యం అందించేందుకు కృషి
గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం అందించ డానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ పేర్కొన్నారు. గుంజాలలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి భూమి పూజ చేశారు. భవన నిర్మాణ పనులు వేగంగా చేపట్టా లని సదరు కాంట్రాక్టర్కు సూచించారు. పనుల్లో నాణ్యత పాటించాలన్నారు. ఎంపీపీ కనక మోతు బాయి, ఎంపీటీసీ ఏత్మాబాయి, గెజిటెడ్ ఉద్యో గుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అజ్మీరా శ్యాంనా యక్, వైస్ ఎంపీపీ జాదవ్ చంద్రశేఖర్, నాయక్ రాథోడ్ యశ్వంత్ రావ్, సర్పంచ్లు యుర్వేత రూప్దేవ్, కుమ్ర సావిత్రిబాయి, సర్పంచ్ బానో త్ గజానంద్నాయక్, నాయకులు యూన్సీ అక్బా నీ, శ్రీరామ్, కనక ప్రభాకర్, మోతె రాజన్న, మాజీ సర్పంచ్ మర్సుకోల తిరుపతి, హైమద్, మాజీ ఎంపీటీసీ రాథోడ్ రమేశ్, సహకార సం ఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, రాథోడ్ బాబు లాల్, రమేశ్, ప్రజలు పాల్గొన్నారు.