డైరెక్టర్ (ఫైనాన్స్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) ఎన్. బలారాం
మందమర్రి జీఎం కార్యాలయంలో అధికారులతో సమావేశం
మందమర్రి రూరల్, ఏప్రిల్ 28 : కరోనా కట్టడికి కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే బొగ్గు ఉత్పత్తి చేపట్టాలని డైరెక్టర్ (ఫైనాన్స్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్) ఎన్. బలారాం సూచించారు. స్థానిక జీఎం కార్యాలయంలో బుధవారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గనులు, డిపార్ట్మెంట్లలో తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మే నెలాఖరు లోగా కార్మికులందరూ తప్పకుండా కొవిడ్ టీకా వేయించుకోవాలన్నారు. వైరస్ ప్రభావం ఎక్కు వ ఉన్న వారి కోసం కంట్రోల్ రూములను ఏర్పాటు చేయాలని సూచించారు. నిత్యం సేవలు అందించే డాక్టర్లకు 10 శాతం అదనపు వేతనం ఇచ్చేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉందని చెప్పారు. ఆక్సిజన్ కొరత లేకుండా విశాఖ పట్టణంలోని స్టీల్ పరిశ్రమతో సంప్రదింపులు చేస్తున్నామన్నారు. ఏరియాలో అదనంగా 500 బెడ్లను ఏర్పాటు చేయాలని, ర్యాపిడ్ టెస్టులు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్ తీవ్రతను నిత్యం గమనిస్తూ అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కార్పొరేట్ డైరెక్టర్ జీఎం (పర్యావరణం) రవి ప్రసాద్, జీఎం చింతల శ్రీనివాస్, ఎస్వోటూ జీఎం గోపాల్సింగ్, పీఎం వరప్రసాద్ పాల్గొన్నారు.