దండేపల్లి, సెప్టెంబర్ 27 : 18 ఏండ్లు నిండి న ప్రతి ఒక్కరూ కరోనా నివారణ వ్యా క్సిన్ తీసుకోవాలని మంచిర్యాల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ సూచించారు. దండేపల్లి మండలంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 100 శాతం పూర్తి చేసేలా వైద్య, జీపీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్ చంద్రకళ, జీపీ కా ర్యదర్శి శ్రీలత, ఏఎన్ఎంలు, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
లక్షెట్టిపేట మండలంలో..
లక్షెట్టిపేట రూరల్, సెప్టెంబర్ 27 : మండలంతో పాటు పట్టణంలోని పలు వార్డుల్లో క రోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నది. కాగా, 13వ వార్డులోని అంబేద్కర్ విజ్ఞాన మందిరంలో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ను అంబేద్కర్ యువజన సం ఘం జిలా ఉపాధ్యక్షుడు శనిగారం లింగన్న సందర్శించారు. కా ర్యక్రమంలో సూపర్వైజర్ ఎంఏ గఫూర్, 13వార్డు వ్యాక్సినేషన్ ఇన్చార్జి గంగ, ఏఎన్ఎం రాజమణి, ఆర్పీ స్వప్న, ఆశ కార్యకర్త మున్ని, అంజలి ఉమారాణి, ప్రసా ద్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్ మండలంలో 5,928 మందికి..
చెన్నూర్ రూరల్, సెప్టెంబర్ 27 : మండలంలోని ప్రతి గ్రామ పంచాయతీలో అర్హులందరికీ వ్యాక్సిన్ అందించనున్నట్లు అంగ్రాజ్పల్లి హెచ్ఈవో జగదీశ్ తెలిపారు. వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్లో భాగంగా వారం రోజులుగా సుమారు 5,928 మందికి టీకా వేసినట్లు ఆయన చెప్పారు. నాగాపూర్లో వ్యాక్సినేషన్ సెంటర్ను సర్పంచ్ అన్నల మానస ప్రారంభించి, ముందుగా టీకా తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అన్నల తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.
వాక్సిన్పై అవగాహన..
బెల్లంపల్లిటౌన్,సెప్టెంబర్ 27 : కరోనా వ్యాక్సిన్పై స్టార్ హెల్త్ ఆధ్వర్యంలో సోమవారం పా త బస్టాండ్ వద్ద అవగాహన కల్పించారు. టీ కా అర్హులైన ప్రతి ఒక్కరూ వేయించుకోవాలని, బీమా తీసుకోవాలని సూచించారు. జిల్లా స్టార్ హెల్త్ డివిజనల్ మేనేజర్ బోగ శ్రీనివాస్, సేల్స్ మేనేజర్స్, ఏజెంట్లు పాల్గొన్నారు.