లక్షలాది మందికి బతుకుదెరువు
ఆయకట్టులో పండుగలా సేద్యం
భరోసానిస్తున్న మత్స్యరంగం
వందలాది గ్రామాలకు శుద్ధజలం
కట్టిపడేస్తున్న ప్రకృతి అందాలు
వెలుగొందుతున్న టూరిజం
కడెం, సెప్టెంబర్ 26 : కడెం జలాశయం.. నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ఆరు మండలాలకు కల్పతరువు. లక్షలాది మందికి బతుకుదెరువు. 7.6 టీఎంసీల నీటి సామర్థ్యమున్న ఈ ప్రాజెక్టు, ఎన్నో గ్రామీణ వర్గాలకు జీవనాధారమైంది. ఏటా రెండు సీజన్లకు నీళ్లిస్తూ ఆయకట్టులో సాగును పండుగలా మార్చింది. చేపల పెంపకంతో మత్స్యకారుల ఉపాధికి భరోసానిస్తున్నది. దీంతో పాటు ఐదు మండలాల్లోని వందలాది గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీరందిస్తున్నది. మరోవైపు ప్రాజెక్టు అందాలు కట్టిపడేస్తుండగా, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలతో ‘పర్యాటకం’ వెలుగొందుతున్నది. మొత్తంగా సాగు, తాగు అవసరాలు తీర్చడంతో పాటు ఆదాయ వనరుగా మారిన కడెం జలాశయంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
డెం జలాశయం 1956లో నిర్మాణమైంది. ఈ ప్రాజెక్టు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ఆరు మండలాలకు వరప్రదాయిని. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు). 18 గేట్లు ఉన్నాయి. కుడి, ఎడమ కాలువలు, 42 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట్, హాజీపూర్ మండలాల్లోని 65 వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నది. డిస్ట్రిబ్యూటరీ-42 వరకు ఈ సాగునీటిని రైతులకు వానకాలం, యాసంగి పంటలకు నీళ్లిస్తున్నది. నాటి ఉమ్మడి పాలనలో ఈ ప్రాజెక్టుపై వివక్ష సాగినా, స్వరాష్ట్రంలో జీవం పోసుకున్నది. జలాశయం పూర్తిస్థాయిలో నిండితే రైతులకు ఎంతో మేలు జరుగుతున్నది.
పండుగలా సాగు..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే పెద్దది కడెం జలాశయం. 1956లో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లోని ఆరు మండలాలకు వరప్రదాయిని. పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు (7.603టీఎంసీలు). 18 గేట్లు ఉన్నాయి. కుడి, ఎడమ కాలువలు, 42 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి. కడెం, దస్తురాబాద్, జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట్, హాజీపూర్ మండలాల్లోని 65 వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నది. డిస్ట్రిబ్యూటరీ-42 వరకు ఈ సాగునీటిని రైతులకు వానకాలం, యాసంగి పంటలకు నీళ్లిస్తున్నది. నాటి ఉమ్మడి పాలనలో ఈ ప్రాజెక్టుపై వివక్ష సాగినా, స్వరాష్ట్రంలో జీవం పోసుకున్నది. ఎక్కడా ఇబ్బందుల్లేకుండా చూస్తున్నది. గతంతో పోలిస్తే జలాశయం పూర్తిస్థాయిలో నిండుతుండగా, ఆయకట్టులో సేద్యం పండుగలా మారింది. రెండు పంటలకు నీళ్లందుతుండగా, లక్షలాది మంది రైతుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
మత్స్యకారులకు భరోసా..
కడెం జలాశయంపై ఆధారపడి దాదాపు 180 మత్స్యకార కుటుంబాలు జీవిస్తున్నాయి. కడెం, పెద్దూర్, ధర్మాజిపేట, వకీల్నగర్, బీర్నంది. రంగపేట, ఖానాపూర్, పెంబి మండలాల నుంచి అనేక గ్రామాల ప్రజలు సొసైటీల ద్వారా చేపల వేట సాగిస్తుంటారు. ఈ జలాశయం అనేక మత్స్యకార కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా లక్షలాది చేపపిల్లలను కొనుగోలు చేసి జలాశయంలో విడుదల చేస్తున్నది. ఐదారు నెలల కాలంలోనే చేప పిల్లలు ఎదుగుతుండగా, మత్స్యకారులు వాటిని పట్టి విక్రయిస్తున్నారు. రోజువారీగా వెయ్యికిపైగా సంపాదిస్తున్నారు. జలాశయం వద్దే చేపలను విక్రయించడంతోపాటు సర్కారు సబ్సిడీపై ఇచ్చిన వాహనాల్లోనే మార్కెట్లకు తరలించి అమ్ముతున్నారు.
కేజ్కల్చర్ ద్వారా ఉపాధి..
ప్రాజెక్టులో కేజ్ కల్చర్ను ఏర్పాటు చేశారు. పది మంది మత్స్యకారులు యూనిట్గా ఏర్పడి, ఈ విధానంలో చేపలను పెంచుతున్నారు. దీనికి కూడా ప్రభుత్వం రాయితీలను అందించింది. 40 లక్షల వ్యయం కాగా, 20 లక్షల వరకు రాయితీ ఇస్తున్నది. దీని ద్వారా ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు.
మిషన్ భగీరథ ద్వారా శుద్ధజలం
కడెం ప్రాజెక్టు పరిధిలో మిషన్ భగీరథ ద్వారా కడెం, ఖానాపూర్, దస్తురాబాద్, పెంబి, జన్నారం మండలాల్లో ఇంటింటికీ శుద్ధజలం అందిస్తున్నారు. మిషన్ భగీరథ ఇంటెక్వెల్ ద్వారానే ఈ ఐదు మండలాలకు తాగునీరిస్తున్నారు. వేసవిలోనూ ఇబ్బందుల్లేకుండా సరఫరా చేస్తున్నారు. ఊరూరా ట్యాంకులు ఏర్పాటు చేసి, పైప్లైన్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. మొత్తం 293 గ్రామాలకు మిషన్ భగీరథ పైపులైన్ల ద్వారా, 9 గ్రామాలకు ఐసొలేటెడ్ సోలార్ ద్వారా తాగునీటిని అందిస్తున్నారు. ఇందుకోసం 368 ట్యాంకులు నిర్మించారు.
ఊపందుకున్న పర్యాటకరంగం..
కడెం జలాశయం అందాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. వానకాలం జలాశయం పూర్తిస్థాయిలో నిండి కళకళలాడడంతోపాటు ప్రాజెక్టు చుట్టూ ఉన్న పచ్చని సహ్యాద్రి కొండలు చూపరులకు కనువిందు చేస్తాయి. రాష్ట్ర టూరిజం శాఖ ఆధ్వర్యంలో జలాశయంలో స్పీడ్, సాధారణ బోట్లను అందుబాటులోకి తెచ్చారు. జలాశయం అందాలను తిలకించేందుకు హైదరాబాద్తోపాటు ఇతర ప్రాంతాల నుంచి పర్యాటకులు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు. ముఖ్యంగా సెలవు రోజుల్లో సందడి చేస్తున్నారు. ఇక్కడి బోట్లలో విహరిస్తూ అందాలను తిలకిస్తున్నారు. పక్కనే హరిత రిసార్ట్లో సేద తీరుతున్నారు. రిసార్ట్ పరిధిలో నెలకు 5 లక్షల నుంచి 6 లక్షల వరకు ఆదాయం వస్తున్నది. బోటింగ్ ద్వారా ఏడాదికి 8 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయం సమకూరుతున్నది.
ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది
కేజ్కల్చర్ నిర్వహణ కోసం ప్రభుత్వం ఉచితంగా అన్ని వస్తువులు అందించింది. 10 మంది సభ్యులతో యూనిట్ ఏర్పాటు చేసుకున్నాం. దీనికి మొత్తం రూ. 40 లక్షల వ్యయం కాగా, మొదటి విడుత కింద రూ. 20 లక్షలు మంజూరు చేసి, మలివిడుత కింద పూర్తి మొత్తం చెల్లించారు. ఈ కేజ్కల్చర్ విధానం వల్ల మాకు ఎంతో మేలు జరిగింది. కడెం ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది కాబట్టే మా జీవితాలకు ఓ ఆధారం దొరికింది.
ఉచిత పిల్లల పంపిణీతో ఉపాధి..
ప్రభుత్వం ప్రతి ఏడాది కడెం ప్రాజెక్టులో చేప పిల్లల విడుదల కార్యక్రమం నిర్వహిస్తున్నది. చేపపిల్లలను విడుదల చేయడం, అవి తక్కువ కాలంలో పెరుగుతున్నాయి. మాకు ఆరు నెలల కాలంలోనే కిలో సైజు వరకు చేతికి వచ్చాయి. వాటిని అమ్ముకొని మా కుటుంబాలను పోషించుకుంటున్నాం. దీని వల్ల దాదాపు 200 కుటుంబాలకు మేలు జరిగింది. ప్రభుత్వం మాకు అవసరమైన అన్ని వసతులను కల్పిస్తున్నది. ఇప్పటికే చాలా మందికి సబ్సిడీ మీద వాహనాలు, వలలు అందించింది.
రెండు పంటలకు నీరు..
కడెం ఆయకట్టు కింద నాకు నాలుగెకరాల భూమి ఉంది. ప్రతియేడు రెండు పంటలకు నీరు అందుతున్నది. దీనివల్ల నాకు ఒక్క పంటకు రూ. 3 లక్షల వరకు వస్తన్నది. ఇలా ఒక్క ఏడాదిలో రెండు పంటలు తీసుకుంటున్నా. కడెం ప్రాజెక్ట్ రైతులందరికీ వరం. ప్రాజెక్ట్ను నమ్ముకొని జీవిస్తున్న అందరికీ అది మంచి చేస్తున్నది. సాగుకు నీరు అవసరమున్నప్పుడల్లా సకాలంలో విడుదల చేస్తున్నరు.