పెండ్లయిన కూతుళ్లకూ కారుణ్యానికి అవకాశం
ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్
2021-22లో సీఎస్సార్ పనుల కోసం రూ. 60 కోట్లు కేటాయింపు
ప్రకటించిన సీఅండ్ఎండీ ఎన్ శ్రీధర్
గనులపై అంబరాన్నంటిన సంబురాలు
శ్రీరాంపూర్, జులై 26: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లానే సింగరేణిలోని అధికారులు, కార్మికుల ఉద్యోగ విరమణ వయోపరిమితి ఇకపై 61 ఏండ్లకు పెంచుతూ కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సీఎండీ శ్రీధర్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. సంస్థ వ్యాప్తంగా 43, 899 మందికి లబ్ధి చేకూరనుండగా,ఈ ఏడాది మార్చి 31 నుంచి ఇది వర్తిస్తుందని పేర్కొంది. దీంతో పాటు మరికొన్ని వరాలనూ బోర్డు ప్రకటించింది. ప్రధానంగా కారుణ్య నియామకాల్లో వివాహితులైన కూతుళ్లకూ అవకాశం కల్పించింది. నిధుల కేటాయింపులతో పాటు విధానపరమైన నిర్ణయాలకూ ఆమోద ముద్ర వేసింది. దీంతో మంచిర్యాల జిల్లాలోని గనులపై టీబీజీకేఎస్ నాయకులు పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్లో ని అధికారులు, కార్మికులకు ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 61 ఏండ్లకు పెంచుతూ సంస్థ బోర్డు ఆమోదం తెలిపిం ది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల నేపథ్యంలో సోమవారం జరిగిన 557వ సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ పేర్కొన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో సోమవారం నిర్వహించిన ఈ సమావేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల డైరెక్టర్లు పాల్గొని పలు తీర్మానాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ విరమణ వయసును 58 నుం చి 61 ఏండ్లకు పెంచుతూ సీఎం కేసీఆర్ ఇటీవల నిర్ణయం తీ సుకున్నారు. దీంతో పాటు సింగరేణి కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు కూడా వర్తింపజేయాలని ఈ నెల 20న ఆదేశాలు ఇచ్చారు. కాగా, ఈ నిర్ణయాన్ని మార్చి 31 తేదీ నుంచి అమలు చేయడానికి బోర్డు అంగీకరించింది. దీంతో సింగరేణి అధికారు లు, కార్మికులు కలిపి 43,899 మందికి లబ్ధ్ది చేకూరనుంది. మార్చి 31 నుంచి జూన్ 30వ తేదీ మధ్య కాలంలో ఉద్యోగ విరమణ పొందిన 39 మంది అధికారులు, 689 మంది కార్మికులను కూడా తిరిగి విధుల్లోకి తీసుకోనున్నారు. దీనిపై సమగ్రమైన విధివిధానాలు రూపొందించాలని సీఅండ్ఎండీ శ్రీధర్ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ వయో పరిమితి పెంపును సింగరేణి విద్యా సంస్థల్లో కూడా అమలు చేయనున్నారు. కాగా కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో ఇప్పటి వరకు కేవలం కుమారులకు, అవివాహిత కుమార్తెలకు మాత్రమే అవకాశం కల్పిస్తుండగా, కార్మికుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు పళ్లైన, విడాకులు తీసుకున్న, ఆధారపడి ఉన్న కు మార్తెలు, ఒంటరి మహిళలకు కూడా వయోపరిమితికి లోబడి కారుణ్య ఉద్యోగ నియామక ప్రక్రియలో వారసత్వ ఉద్యోగం పొందేందుకు బోర్డు ఆమోదించింది.
సీఎస్సార్కు రూ. 60 కోట్లు
సింగరేణి సమీప గ్రామాల అభివృద్ధికి సామాజిక బాధ్యతగా సీఎస్సార్ నిర్వహణకు 2021-22 ఆర్థిక సంవత్సరానికి రూ. 60 కోట్లు వెచ్చించడానికి ఆమోదం తెలిపింది. అలాగే వివిధ గనులకు అవసరమైన యంత్రాలు, కాంట్రాక్టు పనులు తదితర అంశాలకు కూడా బోర్డు ఆమోదించింది. రామగుండంలో కొత్తగా ప్రారంభించనున్న ఆర్జీ-ఓసీ 5కి రెండు కొత్త రోడ్ల నిర్మాణానికి అవసరమయ్యే బడ్జెట్కు అంగీకారం తెలిపారు. ఫస్ట్ క్లాస్ మేనేజర్ సర్టిఫికెట్ ఉన్న మైనింగ్ అధికారుల డిజిగ్నేషన్ మార్పునకు కూడా ఆమోద ముద్ర వేశారు ఆర్థికంగా వెనుకబడి న వర్గాలకు 10 శాతం రిజర్వేషన్కు ఆమోదించారు .
363 ఎన్హెచ్ నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు
శ్రీరాంపూర్ ఏరియా మీదుగా నిర్మిస్తున్న జాతీయ రహదారి 363 విస్తరణ భూనిర్వాసితులైన స్థానికులకు రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సింగరేణి నిర్వాసిత కాలనీలో 85 చదరపు గజాల విస్తీర్ణం గల స్థలంతో 201 ప్లాట్లను కేటాయించడానికి కూడా బోర్డు ఆమోదించింది. బోర్డు సమావేశంలో రాష్ట్ర ఆర్థ్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, రాష్ట్ర ఇంధన శాఖ కా ర్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ డైరెక్టర్ పీఎస్ఎల్ స్వామి, డిప్యూటీ డైరెక్టర్ అజీతేశ్ కుమార్, వెస్ట్రన్ కోల్ఫీల్డ్ చైర్మన్ అండ్ ఎండీ మనోజ్కుమార్, సింగరేణి డైరెక్టర్స్ చంద్రశేఖర్, ఎన్ బలరాం, సత్యనారాయణ, జీఎం కోఆర్డినేటర్ కే సూర్యనారాయణ, కంపెనీ కార్యదర్శి శ్రీ మతి సునితాదేవి పాల్గొన్నారు.