ఆసిఫాబాద్ టౌన్, అక్టోబర్ 25 : జిల్లాలో ఇంటర్ ప్రథమ సం వత్సరం పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యా యి. మొదటి రోజు 5,208 మందికి 4,751 మంది విద్యార్థు లు పరీక్షలకు హాజరు కాగా, 457 మంది గైర్హాజరైనట్లు డీఐఈవో శ్రీధర్ సుమన్ తెలిపారు. పరీక్షా కేంద్రాలను జిల్లా పరీక్షల కమిటీ బృందం శంకర్, తిరుపతి సందర్శించారు.
బెజ్జూర్, అక్టోబర్ 25 : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 271 మందికి 236 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు సీఎస్ రాజయ్య తెలిపారు. కేంద్రాన్ని సిట్టిం గ్ స్కాడ్ బాలకిషన్ రావుతో పాటు ఎస్ఐ సాగర్, ఆర్ఐ రాం సింగ్ రాథోడ్ సందర్శించారు. మొత్తం 14 మంది ఇన్విజిలేటర్లు విధులు నిర్వహించారు.
కౌటాల, అక్టోబర్ 25: మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 228 మందికి 206 మంది, జడ్పీ పాఠశాలలో 202 మందికి 175 మంది విద్యార్థులు హాజరయ్యారు. జూనియర్ కళాశాలలో 23, జడ్పీ పాఠశాలలో 27 మంది మొత్తం 50 మంది గైర్హాజరైనట్లు సీఎస్లు తెలిపారు.
దహెగాం,అక్టోబర్ 25: మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో 191 మందికి 161 మంది హాజరు కాగా మరో 30 మంది గైర్హాజరైనట్లు ప్రిన్సిపాల్ నరేందర్ తెలిపారు. డిపార్ట్మెంట్ ఆఫీసర్ అశోక్తో పాటు సిబ్బంది విధుల్లో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు.