తలమడుగు, సెప్టెంబర్ 25 : మండలంలోని రుయ్యాడి, కజ్జర్ల, నందిగామ, పల్సి(కే), లక్ష్మీపూర్, సకినాపూర్, చర్లపల్లిలో శనివారం వరకు కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయినట్లు మండల వైద్యాధికారి రాహుల్ తెలిపారు. మండలంలోని 13 శిబిరాల్లో 1100 మందికి కొవిడ్ టీకాలు వేసినట్లు పేర్కొన్నారు. త్వరలో అన్ని గ్రామాల్లో వందశాతం పూర్తి చేస్తామని చెప్పారు. తలమడుగు రైతువేదికలో నిర్వహిస్తున్న శిబిరాన్ని ఎంపీడీవో రమాకాంత్, రుయ్యాడి శిబిరాన్ని మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు.
భీంపూర్, సెప్టెంబర్25: మండలంలోని కరంజి (టీ)పంచాయతీలో శుక్రవారం వరకు వందశాతం వ్యాక్సినేషన్ పూర్తయినట్లు సర్పంచ్ జీ స్వాతిక, కార్యదర్శి నితిన్, ఏఎన్ఎం సుజాత తెలిపారు. గ్రామంలో మొత్తం జనాభా 1645 కాగా టీకాలకు అర్హులు 1235. ఇందులో 60 శాతం మంది రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకన్నారు. మొదటి డోసు టీకాలు వందశాతం మంది తీసుకున్నారు. కరంజి(టీ) అనుబంధ గ్రామం రాజులవాడిలో ఓ మహిళ మినహా మిగతా అందరూ టీకాలు తీసుకున్నారు. ఆమెకు అవగాహన కల్పించి టీకా ఇస్తామని సిబ్బంది చెప్పారు. మండలంలోని ప్రతి ఉపకేంద్రం పరిధిలో ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తూ టీకా ఇస్తున్నారు.
సిరికొండ,సెప్టెంబర్ 25: మండలంలోని మల్లాపూర్, ఫకీర్ నాయక్ తండా, పొన్న పంచాయతీ కార్యాలయాల్లో శనివారం కొవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. మండల ప్రత్యేకాధికారి విజయ్ కుమార్, ఎంపీపీ అమృత్ రావ్, ఎంపీడీవో సురేశ్ శిబిరాలను పరిశీలించారు. కార్యక్రమాల్లో సర్పంచ్లు చంద్రకళ, లచ్చు, మడావి బాపురావ్, కార్యదర్శులు షేక్ అజ్మత్, శ్రీధర్, వైద్యసిబ్బంది ఉన్నారు.
నేరడిగొండ, సెప్టెంబర్ 25 : మండలంలోని పలు గ్రామాల్లో వ్యాక్సినేషన్ క్యాంపులు కొనసాగుతున్నాయి. యాపల్గూడలో స్థానిక సర్పంచ్ మండాడి గోదావరి, ఎంపీటీసీ మండాడి విజయలక్ష్మి, హెచ్ఈవో హరికుమార్గౌడ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, సెప్టెంబర్ 25: కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేసుకోవాలని ఎంపీపీ పంద్ర జైవంత్రావు కోరారు. మండలంలోని శంభుగూడలో ఏర్పాటు చేసిన వాక్సినేషన్ ప్రక్రియను శనివారం పరిశీలించారు. కార్యక్రమంలో గ్రామస్తులు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
నార్నూర్,సెప్టెంబర్ 25: గాదిగూడ పీహెచ్సీ ఆధ్వర్యంలో మండలంలోని ఆదిమ్యాన్ గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సర్పంచ్ జీ భారత్ శనివారం పరిశీలించారు. హెచ్ఈవో పవర్ రవీందర్, సిబ్బంది ఉమ, అనుసూయ బాయి, అంగన్వాడీ టీచర్ వాణి ఉన్నారు.
తాంసి, సెప్టెంబర్ 25 : వడ్డాడి, గోట్కూరి, హస్నాపూర్లో కొవిడ్ వ్యాక్సినేషన్ కొనసాగింది. కార్యక్రమంలో సర్పంచ్లు శ్రీనివాస్, నర్సింగ్, ఏఎన్ఎంలు సుగుణ, లక్ష్మి, పాల్గొన్నారు.
ఎదులాపురం,సెప్టెంబర్25: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని 10వ వార్డు కౌన్సిలర్ తూర్పుటి సుజాత, భూమన్న శవారం ఒక ప్రకటనలో కోరారు. వార్డు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.