ఆదిలాబాద్ రూరల్, జూన్ 24 : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ టీచర్లు, సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాలలో వ్యాక్సినేషన్ ప్రత్యేక క్యాంప్ను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 8వేల మంది టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది ఉన్నారని, వారందరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యాక్సిన్ అందించాలన్నారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ కోసం సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. జిల్లాలోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది వ్యాక్సినేషన్ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్, డీఈవో రవీందర్ రెడ్డి, జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్విజయసారథి, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.
నిర్మల్ అర్బన్, జూన్ 24 : జూన్ ఒకటి నుంచి పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు, సిబ్బంది వ్యాక్సిన్ వేసుకోవాలని డీఈవో ప్రణీత అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని రాంనగర్ ఆరోగ్య కేంద్రాన్ని ఆమె తనిఖీ చేసి విధుల్లో ఉన్న సీఆర్పీలకు పలు సూచనలు చేశారు. అనంతరం రాంనగర్ కాలనీలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ నుగునూరి ప్రవీణ్ కుమార్, సీఆర్పీ రత్నం, ప్రభ, నాగరాజు ఉన్నారు.