మంచిర్యాలటౌన్, అక్టోబర్ 23: నవంబర్ 15న వరంగల్లో నిర్వహించే టీఆర్ఎస్ ద్విదశాబ్ది విజయగర్జన సభకు మంచిర్యాలలోని 36 వార్డులనుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు హాజరుకావాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. శనివారం మంచిర్యాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ పట్టణ కమిటీ, దాని అనుబంధ సంఘాల నాయకులు, వార్డు కమిటీల సభ్యులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఆదివారం మున్సిపల్ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్ష, కార్యదర్శులను సమన్వయం చేసుకుని వార్డు స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ద్విదశాబ్ది సభతో పాటు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరించాలని సూచించారు. 27న మంచిర్యాలలో నియోజకవర్గ స్థాయి సమావేశం ఉంటుందని తెలిపారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులను ప్రజలు తరిమికొట్టేరోజు దగ్గరలోనే ఉందన్నారు. ఆరేళ్లు ఎమ్మెల్సీగా ఉన్న ప్రేమ్సాగర్రావు నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, రాబోయే రోజుల్లో తాను గెలిస్తే అభివృద్ధి చేస్తానని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. గత ఎన్నికల్లో తాను 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తానని, లేకుంటే రాజకీయ సన్యాసం చేస్తానని మాట తప్పారని అన్నారు. భీమిని మండలం నాయికిని పేటలో ముంపు రైతులకు ఇవ్వాల్సిన రూ.70 లక్షలు ఇవ్వకుండా తనే వాడుకున్నాడని ఆరోపించారు. ప్రజలను దోచుకుని తన స్వార్థంకోసం సేవ పేరుతో కార్యక్రమాలు చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పెంట రాజయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేశ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వసుంధర, ఐసీడీఎస్ మాజీ ఆర్గనైజర్ అత్తిసరోజ, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు పల్లపు తిరుపతి, ప్రధాన కార్యదర్శి గడప రాకేశ్, బిసి సెల్ అధ్యక్షుడు బొలిశెట్టి రాజలింగు, మహిళా విభాగం అధ్యక్షురాలు గరిగంటి సరోజ, యూత్ అధ్యక్షుడు బింగి ప్రవీణ్, మైనార్టీ విభాగం అధ్యక్షుడు నజీర్, నాయకులు గోగుల రవీందర్రెడ్డి, జగన్మోహన్రావు, కొండాల్రావు, షఫీ, కౌన్సిలర్లు, తదితరులున్నారు.
బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే..
లక్షెట్టిపేట రూరల్, అక్టోబర్ 23 : కల్లిబొల్లి మాటలు చెబుతూ ప్రజలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మభ్యపెట్టాలని చూస్తున్నాయని, ఆ రెండు పార్టీలు దొందూ దొందేనని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు విమర్శించారు. శనివారం పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం పార్టీ మండల అధ్యక్షుడు చుంచు చిన్నయ్య అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దివాకర్రావు మాట్లాడుతూ..వరంగల్లో జరిగే విజయ గర్జన సభను విజయవంతం చేయాలన్నారు. 70 ఏళ్ల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని, బీజేపీకి మత ఘర్షణలు తప్ప అభివృద్ధిపై ధ్యాస లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీసీఎమ్మెస్ చైర్మన్ తిప్పని లిం గన్న, డీసీఎమ్మెస్ మాజీ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మం డల ఉపాధ్యక్షుడు అంకతి రమేశ్, యూత్ అధ్యక్షుడు అంకతి గంగాధర్ మోటపలుకుల శ్రీనివాస్, గం గుల రామ్మూర్తి, ఆయా గ్రామాల సర్పంచ్లు, వార్డు మెంబర్లు, టీఆర్ఎస్ గ్రామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
విజయగర్జనను విజయవంతం చేయాలి
దండేపల్లి, అక్టోబర్ 23: వచ్చే నెల 15న వరంగల్లో నిర్వహించనున్న తెలంగాణ విజయ గర్జన సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పిలుపునిచ్చారు. దండేపల్లి మండల కేంద్రంలో నిర్వహించిన టీఆర్ఎస్ పార్టీ సన్నాహక సమావేశంలో మాట్లాడారు.విజయగర్జన సభకు ప్రతి గ్రామం నుంచి బస్సుల్లో తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, రైతుబంధు సమితి కన్వీనర్ గురువయ్య, పీఏసీఎస్ చైర్మన్లు కాసనగొట్టు లింగన్న, సురేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు చుంచు శ్రీనివాస్, బండారి వెంకటేశ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రేని శ్రీనివాస్, టీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల నరేశ్, అల్లం సంతోష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు.