తాంసి, అక్టోబర్ 23: సత్వర న్యాయం కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలని సంస్థ జిల్లా కార్యదర్శి క్షమాదేశ్ పాండే అన్నారు. మండలంలోని బండలనాగాపూర్, పొన్నారిలో జిల్లా న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. పోలీస్, బ్యాంకు, ఇతర సమస్యల పరిష్కారంలో ఇబ్బందులు ఎదురైతే తమను సంప్రదించాలని సూచించారు. సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. ఎలాంటి ఫీజులు లేకుండాఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు. కార్యక్రమంలో న్యాయవాది వెండి భద్రేశ్వర్ రావు, ఎంపీవో సుధీర్రెడ్డి, సర్పంచ్లు గంగుల వెంకన్న, సంజీవ్రెడ్డి, ఎంపీటీసీ రేఖ, పాల్గొన్నారు.
బోథ్, అక్టోబర్ 23: న్యాయ విజ్ఞాన సదస్సులను ప్రజలు వినియోగించుకోవాలని బోథ్ బార్ అసోసియేషన్ కార్యదర్శి పంద్రం శంకర్ కోరారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్లో భాగంగా గుర్రాల తండా, గుట్టపక్క తండా, సొనాలలో బోథ్ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించారు. విద్యాహక్కు చట్టం, బాలకార్మిక నిర్మూలన చట్టం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో న్యాయవాదులు కే విజయ్కుమార్, ఎం స్వామి, సర్పంచ్లు సదానందం, సకారాం, సరిత, హెచ్ఎంలు నర్సయ్య, శుద్ధోధన్, రాజ్కుమార్, కోర్టు సిబ్బంది శశికళ పాల్గొన్నారు.
నార్నూర్,అక్టోబర్ 23: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని గాదిగూడ ఎంపీడీవో రామేశ్వర్ అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఉమ్మడి మండలంలోని సావిరి,మాన్కాపూర్లో మండల న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం ర్యాలీ తీశారు. కార్యక్రమంలో గాదిగూడ జడ్పీటీసీ మెస్రం గంగుబాయి సోము, ఎంపీవో సాయిప్రసాద్, సర్పంచ్లు రాథోడ్ సావీందర్, కొడప మోతుబాయి, మాజీ సర్పంచ్ కొడప జాకు, కార్యదర్శులు సునీల్ కుమార్, లవ్కుమార్ ఉన్నారు.