సీసీసీ నస్పూర్, అక్టోబర్ 22: మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీలోని బీజేపీకి చెందిన 21వ వార్డు కౌన్సిలర్ బేర సత్యనారాయణ, 18వ వార్డు కౌన్సిలర్ కోడూరి లహరి విజయ్ శుక్రవారం హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకైనా పాత్ర వహించిన బేర సత్యనారాయణకు, అప్పటి ఉద్యమ నేత కేసీఆర్తో మంచి అనుబంధం ఉంది. కొన్ని కారణాలతో ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీ పార్టీలో చేరి, మంచిర్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం బీజేపీ పార్టీలో చేరి, 21వ వార్డు కౌన్సిలర్గా గెలుపొందాడు. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఎమ్మెల్యే దివాకర్రావు ఆధ్వర్యంలో బేర సత్యనారాయణ, కోడూరి లహరి విజయ్, ఎంబడి అంజయ్య, రంగు అరుణ్ మంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి కేటీఆర్ ఆహ్వానించారు. పార్టీలో చేరుతున్న వారికి సముచిత స్థానం కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు బేర సత్యనారాయణ తెలిపారు. మళ్లీ సొంత పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, ఎంపీ బొర్లకుంట వెంకటేశ్ నేతకాని, ఎమ్మెల్యే దివాకర్రావు, నస్పూర్ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, పట్టణ పార్టీ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.