ఆదిలాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నవంబరు 15న వరంగల్లో నిర్వహించనున్న విజయగర్జన సభను విజయవంతం చేసి సత్తా చాటాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంత్రులు పువ్వాడ అజయ్కుమార్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో కలిసి ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, ముథోల్, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్నగర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సన్నాహక సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ప్రతి గ్రామం, వార్డు నుంచి నాయకులు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో తరలించాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతిపక్షాల అబద్ధపు ప్రచారాన్ని ఎక్కడికక్కడ తిప్పి కొట్టాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.
టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 15న వరంగల్లో నిర్వహించే విజయగర్జన సభను విజయవంతం చేసి సత్తా చాటాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, మథోల్, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్నగర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలతో సన్నాహక సమావేశం నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలించే విషయంపై నేడు పట్టణ, మండల కమిటీ సమావేశాలు, రేపు వార్డు, గ్రామ కమిటీ సమావేశాలు, 27న నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు. విజయగర్జన సభకు వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని గ్రామాలు, వార్డులకు బస్సులను అందుబాటులో ఉంచాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయని, నాయకులు, కార్యకర్తలు వీటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని, ప్రతి పక్షాల అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ప్రతి నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు సభకు తరలివచ్చేలా చూడాలన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్కుమార్, ఆదిలాబాద్, బోథ్, నిర్మల్, మథోల్, ఖానాపూర్, మంచిర్యాల, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కాగజ్నగర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, విఠల్రెడ్డి, రేఖానాయక్, దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఆత్రం సక్కు, కోనేరు కోనప్ప, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేతకాని, డెయిరీ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ లోక భూమారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలాచారి, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల జడ్పీ అధ్యక్షులు రాథోడ్ జనార్దన్, కోవ లక్ష్మి, విజయలక్ష్మి, భాగ్యలక్ష్మి, మున్సిపల్ చైర్మల్, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ముఖ్యనాయకులు సమావేశంలో పాల్గొన్నారు. కాగా, ప్రభుత్వ విప్, చెన్నూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే బాల్క సుమన్ హుజూరాబాద్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో ఉండడంతో ఆ నియోజకవర్గ నేతలు హాజరుకాలేదు.