ఆదిలాబాద్ టౌన్/ఆదిలాబాద్ రూరల్/తాంసి, అక్టోబర్ 20 : జల్ -జంగల్-జమీన్ నినాదంతో ఆదివాసుల హక్కుల సాధన కోసం నిజాంలను ఎదిరించి అమరుడైన కుమ్రం భీంకు జిల్లా వ్యాప్తంగా బుధవారం వివిధ పార్టీలు, సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులర్పించారు. టీఆర్ఎస్ నాయకులు పట్టణంలోని భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డిభోజారెడ్డి, నాయకులు గంగారెడ్డి, నారాయణ, దుర్గం శేఖర్ పాల్గొన్నారు. పట్టణంలోని కుమ్రం భీం విగ్రహానికి టీమ్మార్పీఎస్ నాయకులు మల్యాల మనోజ్, రాందాస్, మాలసంక్షేమ సంఘం నాయకులు అల్లూరి భూమన్న, దాసరి బాబన్న, సీపీఎం నాయకులు లంకా రాఘవులు , దర్శనాల మల్లేశ్, బండి దత్తాత్రి, కిరణ్ తదితరులు నివాళుర్పించారు. టీఏజీఎస్ నాయకులు, ఆదివాసీ టీచర్స్ యూనియన్ ప్రతినిధులు సిడాం బండు, జ్యోతిరాం తదితరులు ఈ కార్యక్రమం నిర్వహించారు. గోండ్వాన రాయిసెంటర్ ఆధ్వర్యంలో ఆదివాసీ సంఘాల నాయకులు పట్టణంలోని పిట్టల్వాడ నుంచి కుమ్రం భీం చౌరస్తా వరకు సంప్రదాయ వాయిద్యాలతో ర్యాలీగా తరలివచ్చారు. భీం విగ్రహానికి పూజలు చేశారు. పూలమాలలు వేసి నివాళులర్పించారు. చిన్నారులు థింసా నృత్యాలు చేశారు. భీం, బీర్సాముండా వేషధారణలో అలరించారు. కార్యక్రమంలో ఆదివాసీ సంఘాల నాయకులు మడావిరాజు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, జడ్పీటీసీలు కుమ్ర సుధాకర్, గణేశ్ రెడ్డి, నాయకులు దుర్గం శేఖర్, విజ్జగిరి నారాయణ, గంగారెడ్డి పాల్గొన్నారు.
బేల, అక్టోబర్ 20 : మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు గ్రామాల్లో కుమ్రం భీం వర్ధంతి నిర్వహించారు. భీం చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో భగత్ రవీందర్, ఎంపీవో సమీర్ హైమద్, సర్పంచ్లు వట్టి పెల్లి ఇంద్రశేఖర్, ఆడే శంకర్, ఆరుణ్, చందర్షౌవ్, దౌలత్ పటేల్ , ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రంలోని కుమ్రం భీం విగ్రహానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, నాయకులు పూల మాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, ఆడనేశ్వర్ ఫౌండేషన్ చైర్మన్ సతీశ్ పవర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ప్రమోద్ రెడ్డి, సర్పంచ్ల సంఘం మండల అధ్యక్షుడు వట్టిపెల్లి ఇంద్రశేఖర్, సర్పంచ్ వాడ్కర్ తేజ్రావు, దేవన్న, మండల కోఆప్షన్ మెంబర్ తన్వీర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.
గుడిహత్నూర్,అక్టోబర్ 20: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు మెస్రం నాగ్నాథ్ అధ్వర్యంలో మాన్కాపూర్ నుంచి మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న భీం విగ్రహం వరకు ర్యాలీగా వచ్చారు. జెండా ఎగురవేసిన అనంతరం కుమ్రం వంశస్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర కార్యదర్శి కొడప నగేశ్, సర్పంచ్లు కుమ్రం శంభు, లింగు, దస్రు,ప్రభాకర్, పెందూర్ జలపతి, పెందూ ర్ మారుతి, ఉయిక లక్ష్మణ్, గోవింద్, కోవ భగవంత్రావ్, చంపత్ రావ్, రాయిసిడాం జంగు, మెస్రం గంగాధర్, సోయం సతీశ్, భీంరావ్, మర్సకోల జైతు, మడావి దేవ్రావ్, వివిధ గ్రామాల సార్మేడీలు, దేవారీలు పాల్గొన్నారు.
బోథ్, అక్టోబర్ 20: హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వద్ద గిరిజన ఐక్య వేదిక ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన భీం వర్ధంతిలో బోథ్ మండలంలోని ఆదివాసీ గిరిజన నాయకులు పాల్గొన్నారు. భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో న్యాయవాది పంద్రం శంకర్, దుర్వ విశ్వేశ్వర్రావు, గిరిజన ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు వివేక్, సెడ్మకి సంజీవ్, తొడసం గోపాల్, ఆత్రం మోహన్, డొంగరి రమేశ్ పాల్గొన్నారు.
ఇచ్చోడ, అక్టోబర్ 20 : ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఇచ్చోడలో ర్యాలీ నిర్వహించి, జెండా ఎగువేశారు. భీం విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో సంఘం మండల అధ్యక్షుడు ఆత్రం మహేందర్, కొడప నగేశ్, కుమ్రం కోటేశ్వర్, పెందూరు కేశవ్, జలైజాకు, సిడాం మురళీ కృష్ణ, గెడాం నాగేందర్, జంగు, పెందూరు తులసీ, మహిళలు, యువకులు పాల్గొన్నారు. కామగిరిలో భీం విగ్రహానికి సర్పంచ్ తొడసం భీంరావ్, ఎంపీపీ నిమ్మల ప్రీతమ్ రెడ్డి, ఎంపీడీవో రాంప్రసాద్, గ్రామ పటేల్ జుగ్నాక్, ప్రజా యూత్ అధ్యక్షుడు నిమ్మల సుధాకర్రెడ్డి, నక్కల రమణ రెడ్డి, ఆసిఫ్ ఖాన్, గ్రామస్తులు పాల్గొన్నారు.
తలమడుగు, అక్టోబర్ 20 : మండల కేంద్రంలో తుడుందెబ్బ ఆధ్వర్యంలో భీం వర్ధంతి నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, ఆదివాసీ, తుడుం దెబ్బ నాయకులు భీం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్, గాంధీ విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల కేంద్రంలో భీం విగ్రహం ఏర్పాటుకు కృషి చేస్తామని జడ్పీటీసీ గోక గణేశ్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్లు కళ్లెం కరుణాకర్ రెడ్డి, రఘు, నాయకులు కల్యాణం రాజేశ్వర్, మనోహర్, నాయకులు పొచ్చన్న, జ్ఞానేశ్వర్, దిగంబర్, దాంజీ పటేల్, మారుతి పాల్గొన్నారు.
నార్నూర్,అక్టోబర్20: గాదిగూడ మండలం ఝరి గిరిజన సంక్షేమ ఆశ్రమోన్నత బాలుర పాఠశాలలో హెచ్ఎం కొట్నాక్ రాజేశ్వర్, ఉపాధ్యాయులు కుమ్రం భీం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది ఉన్నారు.
ఉట్నూర్, అక్టోబర్20 : మండల కేంద్రంలోని భీం విగ్ర హానికి ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి మంగం మహేశ్వర్రావు, నాయకులు పూలమాలల వేసి నివాళుల ర్పించారు. కార్యక్రమంలో నాయకులు జంగుదేవ్, రాజారాం, ఆత్రం సురేశ్, అర్జున్, త్రిమూర్తి, కోటేశ్వర్రావు పాల్గొన్నారు.