ఓ మహిళ సముద్రాన్ని చూస్తూ.. సరదాగా ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు ఆమె సముద్రంలో పడిపోయింది. ఈ ఘటన మహారాష్ర్ట రాజధాని ముంబైలోని గేట్ వే ఆఫ్ ఇండియా వద్ద చోటు చేసుకుంది. సముద్రాన్ని చూసేందుకు వచ్చిన మహిళ.. అక్కడ నిర్మించిన గోడపై కూర్చున్నది. అలా సముద్రాన్ని చూస్తుండగా.. 20 ఫీట్ల లోతులో పడిపోయింది. దీంతో ఆమె ఒక్కసారిగా అరిచింది. ఆమె అరుపులు విన్న మిగతా పర్యాటకులు అప్రమత్తమయ్యారు. బాధిత మహిళ ప్రాణాలను రక్షించేందుకు అక్కడున్న ఫోటోగ్రాఫర్ గులాబ్ చంద్ సముద్రంలోకి దూకాడు. తాడు, బెలూన్ సహాయంతో మహిళ ప్రాణాలను కాపాడాడు. సకాలంలో స్పందించి ఆమె ప్రాణాలను కాపాడిన ఫోటోగ్రాఫర్పై ప్రశంసల వర్షం కురుస్తోంది. పలువురు గులాబ్ చంద్ను అభినందించారు.