ఆలేరు టౌన్. జూలై 8: అభివృద్ధికి పట్టణ ప్రగతి కార్యక్రమం ఎంతగానో దోహదపడుతున్నదని మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. ఆలేరులోని 4వ వార్డులో గురువారం రూ. 9లక్షల మున్సిపల్ నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాలు మరింతగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ పట్ట ణ ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టారని పట్టణ ప్రగతిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. రాబోయే రోజుల్లో పట్టణ రూపురేఖలు మారనున్నాయన్నారు. ఆలేరును స్థానిక ఎమ్మె ల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి సహకారంతో అభివృద్ధిలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామన్నారు. కార్యక్రమంలో కమిషనర్ లావణ్యలత, కౌన్సిలర్ గుత్తా శమంతారెడ్డి, కోఆప్షన్ మెంబర్ సీస రాజేశ్ తదితరులు పాల్గొన్నారు.
పల్లె ప్రగతి పనుల పరిశీలన
తుర్కపల్లి: మండలంలోని వివిధ గ్రామాల్లో గురువారం పల్లె ప్రగతి కార్యక్రమం జోరుగా కొనసాగింది. ఈ సందర్భంగా గ్రా మాల్లో పారిశుధ్య పనులతో పాటు, రోడ్లకు ఇరువైపులా మొక్క లు నాటారు. ఇంటింటికీ మొక్కలను పంపిణీ చేశారు. ఎంపీపీ సుశీల రాంపూర్తండా, జ్యోతిరాం తండాల్లో వైకుంఠధామం, పల్లె పకృతి వనాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
జాలలో శ్రమదానం
రాజాపేట: పల్లె ప్రగతిలో భాగంగా గురువారం జాలలో స ర్పంచ్ గుంటి మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో శ్రమదానం చేసి వీధులను పరిశుభ్రం చేశారు. కార్యక్రమంలో పంచాయతీ అధి కారి రాంబాబు, కారోబార్ నర్సింహులు పాల్గొన్నారు.
మొక్కల పెంపకంతో పర్యావరణానికి మేలు
ఆలేరురూరల్: మొక్కల పెంపకంతో పర్యావరణానికి మేలు జరుగుగుతుందని సర్పంచ్ల ఫోరం మండలాధ్యక్షుడు బక్క రాంప్రసాద్ అన్నారు.గురువారం మండలంలోని రాఘవాపు రంలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి సురేశ్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉంటాయి
యాదగిరిగుట్ట రూరల్: మొక్కల పెంపకంతో భవిష్యత్ తరా లు ఆరోగ్యంగా ఉంటాయని యాదగిరిగుట్ట ఎంపీడీవో ప్రభా కర్రెడ్డి అన్నారు.గురువారం ఎంపీవో చంద్రశేఖర్తో కలిసి మండలంలోని గౌరాయపల్లి, సాధువెళ్ళి, కంఠంగూడెం, సైదా పురం గ్రామాల్లో జరుగుతున్న విద్యుత్ మరమ్మతులు, పాత ఇండ్లు కూల్చడం, మొక్కల పంపిణీపనులను పరిశీలించారు.