సంగారెడ్డి మున్సిపాలిటీ, జూలై 7 : పట్టణంలో ఆర్థిక మంత్రి హరీశ్రావు సహకారంతో రూ. 6.70 కోట్లతో సమీకృత మోడల్ మార్కెట్ను ఏర్పాటు చేయనున్నట్టు సంగారెడ్డి మాజీ ఎమ్మె ల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. బుధవారం పట్టణ ప్రగతి, హరితహారంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని పలు వార్డుల్లో కౌన్సిలర్ల ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. 35వ వార్డులోని హనుమాన్ మందిరంలో వార్డు కౌన్సిలర్ జీవీ వీణా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రగతి, హరితహారం కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హాజరై మొక్కలు నాటి నీరు పోశారు. అనంతరం వార్డు ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. చెత్తను మురుగు కాల్వల్లో వేయకూడదని సూచించారు. పట్టణంలో మంత్రి హరీశ్రావు సహకారంతో రూ.6.70కోట్లతో సమీకృత మోడ ల్ మార్కెట్ ఏర్పాటు కానున్నదని, ఇందులో మాంసం, చేపలు, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు అమ్ముతారని తెలిపారు. త్వరలో మంత్రి చేతులమీదుగా శంకుస్థాపన చేయనున్నట్లు చెప్పా రు. ప్రతిఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి, మాజీ సీడీసీ చైర్మన్ విజయేందర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర్, ఏఈ లక్ష్మీనారాయణ, శానిటరీ ఇన్స్పెక్టర్ సంపత్రెడ్డి, నాయకులు రవి, పెరుమాండ్ల నర్సింహు లు, ప్రవీణ్, దిడ్డి విఠల్, అనురాధ, మున్సిపల్, మెప్మా సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.