-50 శాతం తగ్గనున్న ఉత్పత్తి
న్యూఢిల్లీ, జూలై 6: కోవిడ్-19 సంక్షోభంతో తలెత్తిన ఇబ్బందుల నుంచి శరవేగంగా కోలుకుంటున్న టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (జేఎల్ఆర్)కు గట్టిషాక్ తగిలింది. సెమీ కండక్టర్ చిప్ల కొరత తీవ్రతరంకావడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ త్రైమాసికంలో ఉత్పత్తి 50 శాతం తగ్గుతుందని జేఎల్ఆర్ మంగళవారం ప్రకటించింది.
జూన్ నెలలో జేఎల్ఆర్ రిటైల్ అమ్మకాలు 68 శాతం పెరిగి 1,24,537 యూనిట్లకు చేరినట్లు సంస్థ ప్రకటించింది. ఆ వెంటనే చిప్ల కొరతతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో ఉత్పత్తి కోతను కూడా కంపెనీ వెల్లడిచేసింది.
దాంతో స్టాక్ మార్కెట్లో జేఎల్ఆర్ మాతృసంస్థ టాటా మోటార్స్ షేర్ 10 శాతం క్షీణించి లోయర్ సర్క్యూట్ను తాకింది. చిప్ల కొరతతో ఒక బిలియన్ పౌండ్ల నగదును నష్టపోవాల్సివస్తున్నదని, ప్రతికూల ఇబిటాను చవి చూడాల్సివస్తున్నదని కంపెనీ పేర్కొంది.
చిప్ల కొరత ప్రభావం ఈ క్యాలెండర్ చివరి వరకూ వుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో మెరుగుదల వుంటుందని భావిస్తున్నట్లు జేఎల్ఆర్ తెలిపింది.
ప్రస్తుతం తమకు సరఫరా అవుతున్న చిప్లను ఎక్కువ లాభాల మార్జిన్ ఇచ్చే వాహనాలకే ఉపయోగిస్తున్నట్లు జాగ్వర్ ల్యాండ్రోవర్ సీఈఓ థెర్రీ బొల్లోర్ తెలిపారు. సెమీ కండక్టర్ సరఫరా మెరుగుపడ్డాక తమ వాహనాలకు పటిష్టమైన డిమాండ్ వుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తమ రేంజ్ రోవర్ ఎవోక్ అప్డేటెడ్ వెర్షన్ డెలివరీలు ప్రారంభించినట్లు జాగ్వర్ ల్యాండ్ రోవర్ మంగళవారం తెలిపింది. ఈ కొత్త ఎవోక్ వెర్షన్ 2 లీటర్ల పెట్రోల్, డీజిల్ పవర్ట్రైన్స్తో లభిస్తుంది.
ఎవోక్కు కొత్త ల్యాండ్రోవర్ టెక్నాలజీలను ఉపయోగించామని, ధరల శ్రేణి రూ.64.12 లక్షల (ఎక్స్షోరూమ్ ఢిల్లీ) నుంచి మొదలవుతుదని జేఎల్ఆర్ ఇండియా ప్రెసిడెంట్ రోహిత్ సూరి తెలిపారు.
బిగ్ బాస్ 5 తెలుగులో ఆలీ ఎంట్రీ.. నిజమెంత?
కర్నాటకం : యడియూరప్పపై టూరిజం మంత్రి తిరుగుబాటు
వరుడికి కట్నంగా ఆక్సిజన్..!
ప్రపంచంలోనే ఎత్తయిన గుర్రం బిగ్ జాక్ ఇకలేదు..!
విస్తారా ఎయిర్లైన్స్ బంపర్ ఆఫర్
రెనాల్ట్ కార్లపై అద్భుతమైన ఆఫర్లు… భారీ డిస్కౌంట్స్…
ఇన్ కమ్ టాక్స్ ఫైల్ చేయడానికి సడలింపులు..
ఏడాదిలో మూడోసారి : టాటా కార్ల ధరలకు రెక్కలు!
రూ.15 లక్షల కోట్లు.. ప్రపంచ కుబేరుల్లో ఇంకా టాప్లోనే బెజోస్
ఆంక్షలపై తగ్గేందుకు సౌదీ ససేమిరా.. సంక్షోభం ముంగిట ఓపెక్?