మోత్కూరు, జూన్19: మండలానికి చెందిన అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారులకు తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ నగదు ప్రోత్సాహాన్ని పంపిణీ చేయగా, శనివారం దత్తప్పగూడెంలో జరిగిన కార్యక్రమంలో మోత్కూరు రైతు సేవాసహకార సం ఘం చైర్మన్ కంచర్ల అశోక్రెడ్డి వారికి అందజేశారు. జూలై 13న నేపాల్లో జరగనున్న అండర్-19 కబడ్డీ పోటీలకు దత్తప్పగూడెనికి చెందిన బొడిగే రాజు, కొండాపురం సతీశ్ ఎంపిక కాగా, ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తీపిరెడ్డి మేఘారెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షుడు కల్యాణ్ చక్రవర్తి, బీసీ సెల్ మండలాధ్యక్షుడు విష్ణుమూర్తిగౌడ్, సర్పంచ్ శోభాసోమయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు సత్తయ్య, కో-ఆప్షన్ సభ్యుడు సాజీద్, సత్తయ్య, యాదయ్య, రవి, వెంకటేశ్, ప్రవీణ్ ,సాయి, మత్స్యగిరి, శ్రీకాంత్ పాల్గొన్నారు.