గ్రేటర్ పరిధిలో నూతన రోడ్లు, వాటి నిర్వహణ విషయంలో ఏ మాత్రం రాజీ పడొద్దని..జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యాన్ని ఉపేక్షించరాదని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సికింద్రాబాద్ జోన్ పరిధిలో కాంప్రెహెన్సివ్ రోడ్ మెయింటెనెన్స్ ప్రోగ్రామ్ (సీఆర్ఎంపీ) కింద వేసిన రహదారిలో ఉన్న మ్యాన్హోల్పై మూతలేకపోవడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. తక్షణమే బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని గురువారం మంత్రి కేటీఆర్ పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ను ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు ఆయన విచారణ జరిపి బల్దియా అసిస్టెంట్ ఇంజినీర్ ఎం.రాజశేఖర్, వర్క్ ఇన్స్పెక్టర్ మహ్మద్ యూసుఫ్లను సస్పెండ్ చేశారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శివానంద్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ టీఎస్ఆర్ ఆంజనేయులుకు మెమోలు జారీ చేశారు. పద్మారావునగర్ మెయిన్రోడ్డు సీఆర్ఎంపీ బాధ్యతలు నిర్వహిస్తున్న మెసర్స్ కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్కు రూ.లక్ష జరిమానా విధించారు.
రోడ్ల నిర్వహణ, పనుల్లో ఇబ్బందులు ఉన్నా వెంటనే పౌరులు తమ దృష్టికి తీసుకురావాలని అధికారులు సూచించారు. ఇందుకోసం వాట్సాప్ నంబర్, ట్విట్టర్ ఐడీలను అందుబాటులోకి తెచ్చారు. ఫిర్యాదు ఇలా..