హైదరాబాద్ : రాష్ట్రంలో వానాకాలం సాగుకు రైతులకు ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం పంపిణీ కొనసాగుతున్నది. ఇవాళ 3 ఎకరాల్లోపు భూమి ఉన్న 10,40,017 మంది రైతుల ఖాతాల్లో రూ.1275.85 కోట్ల నగదును సర్కార్ జమ చేయనుంది. ఇప్పటివరకు 42,42,178 మంది రైతుల ఖాతాల్లో రూ. 2,942.27 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది. రైతులు పంట సాగు చేసుకునేందుకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతుబంధు పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ. 10 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. రైతుబంధు నగదు ఖాతాల్లో జమ కావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.