తమిళనాడుతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. త్వరలో సినిమా షూటింగ్స్ కూడా షురూ కానున్నాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ మేకర్స్ చూపు హైదరాబాద్ పై పడ్డది. రాబోయే రెండు నెలలపాటు హైదరాబాద్ లోని రామోజీఫిలింసిటీ కోలీవుడ్ స్టార్ హీరోలకు ఇళ్లుగా మారిపోనుందట. కోలీవుడ్ స్టార్ హీరోలు కమల్హాసన్, సూర్య, కార్తీ త్వరలో ఫిలింసిటీలో షూటింగ్స్ లో పాల్గొననున్నారట.
దీంతోపాటు కొన్ని కన్నడ, హిందీ సినిమాల చిత్రీకరణ కూడా హైదరాబాద్ లోనూ జరుగనున్నట్టు ఫిలింనగర్ సర్కిల్ టాక్. కోవిడ్ ఎఫెక్ట్ తో సినిమాల షూటింగ్స్ లేక వెలవెలబోయిన హైదరాబాద్ త్వరలోనే కళకళలాడబోతుందన్నమాట. కమల్ హాసన్ ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్ డైరెక్షన్ లో విక్రమ్ సినిమా చేస్తున్నాడు. మరోవైపు కార్తీ, సూర్య కూడా తమ ప్రాజెక్టులతో బిజీ కానున్నారు.
ఇవి కూడా చదవండి..
ఆర్ఆర్ఆర్ చివరి ఘట్టానికి ముహూర్తం ఫిక్స్..!
సీఎం సహాయనిధికి రూ.25 లక్షలు విరాళం ఇచ్చిన విజయ్ సేతుపతి
కొత్త సినిమాలో రవితేజ పాత్ర ఇదే..!
థియేటర్లలోనే అక్షయ్ బెల్బాటమ్.. రిలీజ్ తేదీ ప్రకటన
విజయ్ సేతుపతితో ప్రశాంత్ నీల్ చర్చలు..!
అక్షయ్ కుమార్ @ 1000 కోట్లు..ఖిలాడీ దూకుడు..!
టాలీవుడ్ కమ్ బ్యాక్ త్వరలో..కైరా ట్వీట్
పూరీ జగన్నాథ్ పక్కా ప్లానింగ్ ..ఏకంగా బాలయ్యతోనే..!
పవన్ కల్యాణ్ తో వన్స్ మోర్పై నో క్లారిటీ..?