హైదరాబాద్: ఉప్పల్లో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. ఉప్పల్ సమీపంలోని మేడిపల్లి వద్ద రోడ్డుపై ఏర్పడిన గుంతలో ఓ లారీ దిగబడింది. దీంతో ఉప్పల్-పీర్జాదిగూడ మార్గంలో మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. భారీగా ట్రాఫి జామ్ కావడంతో వరంగల్ వైపు వెళ్తున్న వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్రేన్ సహాయంతో లారీని బయటకు తీశారు. అనంతరం ఆ గుంతను పూడ్చివేసి ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు.