మూసాపేట, జూన్7: తన భార్యను తిడుతున్నాడనే కోపంతో మతిస్థిమితం లేని తండ్రిని హత్య చేశాడు. కూకట్పల్లి సీఐ నర్సింగ్రావు తెలిపిన వివరాల ప్రకారం.. కూకట్పల్లి పరిధిలోని సఫ్దర్నగర్కు చెందిన ఇంతియాజ్ (55) గత పదేండ్లుగా ఆర్ఎంపీ డాక్టరుగా పని చేశాడు.. ఇతనికి భార్య, ఇద్దరు కొడుకులు. కొడుకులు వేరువేరుగా ఉంటున్నారు. కాగా.. ఇంతియాజ్ గత కొన్ని రోజులుగా మతిస్థిమితం కోల్పోయి .. ఎటువంటి కారణం లేకుండా కుటుంబ సభ్యులతో గొడవపడుతుండేవాడు. ఆదివారం రాత్రి పెద్ద కొడుకు సలాఉద్దీన్ భార్య తో గొడవపడ్డాడు. అయితే.. ఉద్దేశపూర్వకంగా తన భార్యను తిడుతున్నాడనే కోపంతో తండ్రితో ఘర్షణకు దిగి.. అక్కడ ఉన్న సెంట్రింగ్ కర్రతో తలపై కొట్టగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. పక్క ఇంట్లో ఉంటున్న చిన్న కుమారుడు బుర్రనొద్దీన్ గమనించి.. తండ్రిని ప్రైవేటు దవాఖానకు తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందాడని చెప్పారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.