మునిపల్లి/సంగారెడ్డి : కరోనా విపత్కర పరిస్థితుల్లో ఆపదలో ఉన్న అభాగ్యులను కాపాడేందుకు ఎల్లప్పుడూ ముందుంటున్నాడు సినీ నటుడు సోనూ సూద్. అతడిని ప్రజలు ఇప్పుడు దేవుడు, రియల్ హీరో అంటూ ఆప్యాయంగా పిలుచుకుంటున్నారు. కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు రెక్కలు కట్టుకొని వాలిపోతున్నాడు రియల్ హీరో సోనూ సూద్. తన పరిధి మేరకు సాయమందిస్తూ ఎంతో మంది హృదయాలను గెల్చుకున్నాడు. అందుకే అతడిని ఒక్కసారి కలిస్తే చాలు జన్మ ధన్యమవుతుందని భావించే వారు నేడు కోకొల్లలుగా ఉన్నారు.
ఇప్పుడు అదే కోవలో చేరిపోయాడు తెలంగాణలోని వికారాబాద్ యువకుడు. సోనూ సూద్ నా దేవుడు. అతడిని ఒక్కసారి కలువడమే నా ఏకైక లక్ష్యం అంటూ ఓ యువకుడు పాదయాత్ర చేపట్టాడు. వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా పరిగి మండలానికి చెందిన వెంకట్ అనే యువకుడు గత రెండు రోజుల క్రితం ముంబైలో ఉండే సోనూ సూద్ను కలిసేందుకు పరిగి నుంచి బయలుదేరి బుధవారం మునిపల్లి మండలం బుధేరా చేరస్తాకు చేరుకున్నాడు.
ఈ సందర్భంగా పాదయాత్ర చేస్తున్న యువకుడు వెంకట్ మాట్లాడుతూ.. నేను సోనూ సూద్ సార్ను కలిసేందుకు బయలుదేరే ముందు సార్కు చిన్న మెసేజ్ చేశాను. అందుకు వెంటనే సార్ స్పందించి నాకు ఫోన్ చేసి ఇక్కడి వరకు నువ్వు పాదయాత్రతో రావొద్దు ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు.
అయినప్పటికీ సార్పై ఉన్న ప్రేమ నన్ను ముంబై వరకు తీసుకుపోయేలా చేస్తుందన్నారు. నేను తొందరలోనే ముంబై చేరుకొని నేను దేవుడిలాగా భావించే సోనూ సూద్ను కలిసి ఆరోగ్యాంగ తిరిగి ఇంటికి చేరుకుంటానని చిరు నవ్వుతో పాదయాత్ర కొనసాగించాడు.
ఇవి కూడా చదవండి..
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు