న్యూఢిల్లీ: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ఎక్స్7 సిరీస్లో డార్క్ షాడో ఎడిషన్ను దేశీయ విపణిలో ఆవిష్కరించింది. అమెరికాలోని సౌత్ కరోలినా ప్లాంట్లో తయారవుతున్న ఈ కార్లు కేవలం 500 యూనిట్లు మాత్రమే విక్రయిస్తామని తెలిపింది. దీని ధర రూ. 2.02కోట్లు.
తొలిసారి ఫ్రోజెన్ ఆర్కిటిక్ గ్రెమోటాలిక్ రంగుతో కూడిన పెయింట్ ఈ కారుకు అదనపు ఆకర్షణ కానుంది. కారు బయట పూర్తిగా చిక్కటి నల్లటి రంగు పెయింట్ వేశారు.
బీఎండబ్ల్యూ మార్క్ కిడ్ని గ్రిల్స్, ఎగ్జాస్ వ్యవస్థకు ఉన్న టెయిల్ పైప్సిస్టమ్ కవర్స్కు కూడా నలుపు రంగు పెయింట్ వేయడం విశేషం. ఈ కారుకు 22 అంగుళాల ఎం లైట్ అల్లాయ్ వీల్స్ అమర్చారు. వీ స్పోక్ డిజైన్తో ఆకర్షణీయంగా ఉన్నాయి అల్లాయ్ వీల్స్.
ఇక ఈ లిమిటెడ్ ఎడిషన్ కారు ఆరు, ఏడు సీట్ల వేరియంట్లలో లభిస్తుంది. ఇక ఇంటీరీరియర్లో నైట్ టోన్ బ్లూ, బ్లాక్ రంగు పెయింట్లను వాడారు. దేశీయ మార్కెట్లో ఈ కారు ఎక్స్7 ఎం50 ట్రిమ్ రేంజ్లోనే లభిస్తుంది.
ఈ కారులో 3.0 సిక్స్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఉంది. 8స్పీడ్ ట్రాంక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అమర్చారు. ఈ ఇంజిన్ 400 బీహెచ్పీ శక్తితోపాటు 760 ఎన్ఎం టార్చ్ విడుదల చేస్తుంది. కేవలం 5.4 సెకన్లలోనే ఈ కారు 100 కిలోమీటర్ల స్పీడ్తో దూసుకెళ్తుంది.
రేపట్నుంచి బ్యాంకుల పని వేళల్లో మార్పు
ఐటీ రూల్స్: ఫిర్యాదుల స్వీకరణకు సోషల్ మీడియా ఏర్పాట్లు!
చిన్న వ్యాపారులకు రిలీఫ్.. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ!
ఎస్బీఐ vs యాక్సిస్ vsహెచ్డీఎఫ్సీ ఫిక్స్డ్ డిపాజిట్లు ఇలా..
కరోనా వేళ కస్టమర్లకు ఎస్బీఐ రిలీఫ్.. అదేంటంటే!!
మోదీ సర్కార్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : సచిన్ పైలట్
జూన్ 20 తర్వాత స్పుత్నిక్ వీ టీకాల తొలి బ్యాచ్ రాక
రాజద్రోహానికి పరిమితులను సెట్ చేయాల్సిందే: సుప్రీంకోర్టు
ఆర్థిక ఇబ్బందులతో సర్రోగేట్ తల్లులుగా అమ్మాయిలు
రెండు వేర్వేరు డోసులు తీసుకుంటే ఎలా ? వ్యాక్సిన్ మిక్సింగ్పై త్వరలో స్టడీ
కరోనా చికిత్స: రూ.5 లక్షల వరకు అన్సెక్యూర్డ్ లోన్లు!
ఐసోలేషన్ కేంద్రంతో నిరుపేదలకు మేలు