లాక్డౌన్ వేళ అన్నార్థులను జీహెచ్ఎంసీ అమ్మలా ఆదుకుంటున్నది. కడుపునిండా కమ్మని భోజనం పెట్టి అండగా నిలుస్తున్నది. ఉదయం 10 నుంచి తెల్లవారి 6 వరకు అన్నింటికీ ‘లాక్’ పడినా.. అన్నపూర్ణ భోజన కేంద్రాలు మాత్రం నిర్విరామంగా పనిచేస్తూనే ఉన్నాయి. నిరాశ్రయులు, నిరుపేదలు, దవాఖానల్లో ఉన్న వారి అటెండెంట్ల కోసం లాక్డౌన్ సమయంలో మరో 132 తాత్కాలిక కేంద్రాలను ఏర్పాటు చేసిన జీహెచ్ఎంసీ రోజువారీ ఉచిత భోజనాల సంఖ్యను కూడా రెట్టింపు చేసింది. ఈనెల 13న ప్రారంభమైన ఈ ఉచిత భోజనాల ద్వారా తొలిరోజు 29,519 మందికి భోజనాలు అందిస్తే.. గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 72,890 మందికి అందజేశారు.