న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా రెండో వేవ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో అన్ని వర్గాల, రంగాల ప్రజలు ఆందోళనతో అల్లాడిపోతున్నారు. దీంతో పలు ఆటోమొబైల్ సంస్థలు తమ కస్టమర్ల వారంటీ, సర్వీసింగ్ పీరియడ్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
దేశీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా జూలై 31వ తేదీ వరకు తమ కస్టమర్ల వారంటీ, సర్వీసింగ్ గడువు పొడిగిస్తున్నట్లు తెలిపింది.
కరోనాను నియంత్రించడానికి వివిధ రాష్ట్రాలు లాక్డౌన్ అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఈ నెలాఖరు వరకు వారంటీ గడువు ముగిసే వారికి ఇది వర్తిస్తుంది.
జర్మనీ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడీ మేనేజ్మెంట్.. భారత్లోని తమ కస్టమర్ల వారంటీ, సర్వీస్ ప్లాన్లను వచ్చేనెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్, మే నెలల్లో వారంటీ లేదా సర్వీసింగ్ ప్లాన్లు ముగిసే కార్లకు మాత్రమే ఈ పొడిగింపు అమలవుతుంది.
ప్రముఖ దేశీయ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ తమ వాణిజ్య వాహనాల వినియోగదారుల వారంటీ, ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్ను జూన్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు తెలిపింది. కరోనాను నియంత్రించడానికి పలు రాష్ట్రాలు ఆంక్షలు అమలు చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది.
బజాజ్ ఆటోమొబైల్ తన కస్టమర్లకు చెందిన అన్ని బ్రాండ్ల వాహనాలకు జూలై నెలాఖరు వరకు ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్ పొడిగిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మే 31 వరకు ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్ ముగిసే వాహనాలకే ఇది వర్తిస్తుంది.
ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హోండా మోటారు సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తన అన్ని మోడల్ బైక్స్, స్కూటర్ల వారంటీ, ఫ్రీ సర్వీసింగ్ పీరియడ్ను జూలై నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు పేర్కొంది. ఏప్రిల్ 1-మే 31 మధ్య వారంటీ గడువు ఉన్న వాటికే ఇది వర్కవుట్ అవుతుంది.
రాబోయే 12 గంటల్లో అతి తీవ్ర తుఫానుగా ‘యాస్’
మరోసారి పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఈ నెలలో 13వ సారి పెంపు
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
కరోనాపై మాటల్లోనే భయం.. చేతల్లో లేదు
తృణమూల్ పద్మవ్యూహంలో బీజేపీ ఉక్కిరిబిక్కిరి!
రేపు సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్లో పాక్షికమే!
చోక్సీ కొత్త ఎత్తు.. అంటిగ్వా నుంచి క్యూబాకు మకాం మార్పు!
టాటా స్టీల్ మహా ఔదార్యం.. కంపెనీపై కురుస్తున్న ప్రశంసల జల్లు
కరోనా నుండి కోలుకున్న జూనియర్ ఎన్టీఆర్
గంటకు రూ.75 కోట్లు పెరిగిన గౌతం ఆదానీ సంపద!
మలేషియాలో రెండు రైళ్ల ఢీ.. 213 మందికి గాయాలు
డైమండ్ ట్రేడర్ నుంచి.. ఆసియా బిలియనీర్ వరకూ..!!
లక్షల కోట్ల పెట్టుబడులు పెడతాం.. అనుమతించండి మోదీజీ – విస్మయం కలిగిస్తున్న పత్రికా ప్రకటన