భువనగిరి టౌన్/ ఆలేరుటౌన్ మే 24 : జిల్లాలో అన్నదాతలు వానకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే యాసంగి సీజన్ ముగిసి ధాన్యం చేతుకొచ్చింది. ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. మృగశిర కార్తె దగ్గర పడుతుండటంతో రైతన్న సాగుబాట పడుతున్నాడు. ఇందు కు సంబంధించి దుక్కులను దున్నే పనుల్లో నిమగ్నమవుతున్నారు. వానాకాలం సీజన్కు సంబంధించి వ్యవసాయశాఖ అధికారులు ముందస్తు ప్ర ణాళికను సిద్ధం చేశారు. జిల్లాలో 460138 ఎక రాల్లో పంటలు సాగు కానున్నట్లు అంచనా వేశా రు. వర్షాలు అనుకూలిస్తే సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పంటల సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లా రై తాంగం వానకాలంలో అత్యధికంగా వరి, పత్తి పంటలు పండించనున్నారు.
వరి 2,04,366 ఎకరాల్లో, పత్తి 1,91,766, కందులు 46,333, జొన్నలు 2,298, మినుములు 812, కూరగాయ లు 13,575 ఎకరాల్లో సాగు చేయనున్నారు. ఇవే కాకుండా సజ్జలు, కొర్రలు, మొక్కజొన్నలు, పొ గాకు, జనుములు, ఆముదాలు, ఎర్ర జొన్నలు త దితర పంటలు సాగు చేయనున్నారు. ఇతర పం టలు 49363 ఎకరాల్లో సాగుచేస్తారని అంచనా వేశారు. అలాగే జిల్లాలో 75,805 టన్నుల ఎరువులు అవసరం ఉన్నట్లు గుర్తించారు. అంతేకా కుండా పంటలు సాగు చేసేందుకు అవసరమైన విత్తనాలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అధికారులు ప్రతిపాదనలు పం పారు.తెలంగాణ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్, హాకా, ఇతర ప్రభుత్వరంగ సంస్థల ద్వారా సబ్సిడీపై విత్తనాలు పంపిణీ చేయనున్నారు. ఒకవేళ సాగు విస్తీర్ణం పెరిగినా అవసరమైన విత్తనాలు పంపిణీ చేయనున్నారు.
ఆధునిక పద్ధతులతో అధిక దిగుబడులు
ఈ ఏడాది కూడా వర్షాలు బాగా కురిసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నాణ్యమైన దిగుబడులు సాధించాలంటే దుక్కులు మొదలుకొని విత్తనం విత్తే వరకు ఆధునిక పద్ధతులు పా టించాలని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు.వేసవికాలం దుక్కులు దున్నేందుకు చాలా అనువైంది. దుక్కులను లోతుగా దున్నాలి. ఇలా చేయడం వల్ల నేలలో ఉన్న కీటకాల కోశస్థ దశలు బయట పడి సూర్యరశ్మికి చనిపోతాయి. ఇందుకు డిస్క్ప్లౌ, డిస్క్హారో, కల్టివేటర్లు ఉపయోగపడతాయి, వరి పొలాల్లో కొయ్య కాళ్లల్లో ఉండే కాం డం తొలిచే పురుగు కోశస్థ దశలు పూర్తిగా నిర్మూలించబడుతాయి. రోటోవేటర్తో దుక్కి దున్నడం వల్ల చీడపీడల సమస్య తగ్గుతుంది. భూసారం పెరుగుతుంది. అలాగే తొలకరి వర్షం కురియగానే వరి సాగు చేసే భూముల్లో పచ్చిరొట్ట పైర్లు సాగు చేయాలి. జనుము, జీలుగా, పెసర, మినుము, బొబ్బర, పిల్లిపెసర విత్తనాలను విత్తి పూత దశకు వచ్చే సమయంలో భూమిలో కలియదున్నాలి.
ప చ్చిరొట్ట పైరు భూమిలో తొందరగా కుళ్లడానికి సూపర్ పాస్పెట్ ఎరువును వినియోగించాలి. ఇ లా చేయడం వల్ల భూమిలో సారం పెరుగుతుం ది. పంటల సాగులో సేంద్రియ ఎరువుల వినియో గం తప్పనిసరి. వీటిని భూమిలో వేయడం వల్ల కర్బన శాతం పెరుగుతుంది. పెంట మట్టి, గొర్రె ఎరువు, కోడి పెంట ఎండలు ఉన్న సమయంలో కాకుండా తొలకరి జల్లులు పడిన తర్వాత వ్యవసాయ భూమిలో వేస్తే పోషకాలు నష్టపోకుండా ఉంటాయి. భూమిలో సారం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా భూసార పరీక్షలు చేయించాలి. దీం తో ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గించుకోవచ్చు. అం తేకాకుండా వర్షాకాలంలో కురిసే ప్రతి నీటిబొట్టును పంటపొలంలోనే ఇంకించు కుంటే మేలు. అలాగే పంటల సాగులో మేలు రకం విత్తనాలు ఎంపిక చేసుకోవడంతో పాటు విత్తు స్థాయి నుంచి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటి రెండు వర్షా లు కురియగానే విత్తుకోకుండా, 60 మి.మీలకు పైగా వర్ష్షపాతం నమోదైన తర్వాత విత్తుకుంటే మొలక శాత సరిగ్గా ఉంటుంది.