హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కరోనా క్లిష్ట పరిస్థితుల్లోనూ వేగంగా ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నట్టు పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. యాసంగి ధాన్యం కొనుగోళ్ల లక్ష్యం 80 లక్షల టన్నులు కాగా, ఇప్పటికే 52 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్టు వెల్లడించారు. ఇప్పటివరకు 6,892 కేంద్రాల ద్వారా 7.45 లక్షల మంది రైతుల నుంచి రూ.9,886 కోట్ల విలువైన ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. గత 21 రోజుల్లో 40.62 లక్షల టన్నుల ధాన్యం సేకరించామన్నారు. దేశం మొత్తం మీద తెలంగాణ ప్రభుత్వమే ధాన్యం కొనుగోళ్లు చేస్తున్నదని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నారు.