ఆర్మూర్, మే 21: ఏ కష్టమొచ్చినా తక్షణమే స్పందించి బాధితులకు అండగా నిలుస్తున్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. బ్లాక్ ఫంగస్ బాధితులకు అవసరమైన మందులను సమకూర్చి మరోసారి ఔదార్యాన్ని చాటుకున్నారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన తొర్లికొండ మల్లయ్య, భోజారెడ్డిలకు బ్లాక్ ఫంగస్ చికిత్స నిమిత్తం ఇంజక్షన్లు కావాలని స్థానిక ఎమ్మెల్యే జీవన్రెడ్డి మంత్రి కేటీఆర్ను ట్వీట్ ద్వారా కోరారు. తక్షణమే స్పందించిన మంత్రి.. ఆ ఇంజక్షన్లను శుక్రవారం సమకూర్చారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఎమ్మెల్యే జీవన్రెడ్డితోపాటు బాధిత కుటుంబాల సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.