Adilabad
- Nov 25, 2020 , 04:26:47
పంటకల్లాలతో రైతులకు ప్రయోజనం

- ఆదిలాబాద్ డీఆర్డీఏ ఏపీడీ రవీందర్
భీంపూర్: ప్రభుత్వం నిర్మిస్తున్న పంటకల్లాలతో రైతులకు మేలు చేకూరుతుందని ఆదిలాబాద్ డీఆర్డీఏ ఏపీడీ రవీందర్ రాథోడ్ అన్నారు. భీంపూర్ మండలంలోని నిపాని, వడ్గాం గ్రా మాలను ఆయన మంగళవారం సందర్శించి పంటకల్లాలు, ప్రకృతివనాలు, వైకుంఠధామాలు, డంప్ యార్డులను పరిశీలించారు. ఇప్పటికే అందర్బంద్, వడ్గాం, నిపాని గ్రామాల్లో కొందరు రైతులు పంటకల్లాలు నిర్మించుకున్నట్లు తెలిపారు. ఈజీఎస్ ద్వా రా ఈ కల్లాలు నిర్మించుకునే అవకాశం ఉన్నా, కొందరు శ్రద్ధ చూపడం లేదని పేర్కొన్నారు. రైతులకు సర్పంచ్లు అవగాహన కల్పించాలని సూచించారు. పల్లె ప్రకృతి వనాల పనులను త్వర గా పూర్తిచేయాలన్నారు. ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీవో వినోద్, ఈజీఎస్ ఏపీవో సంగీత, ఈసీ నరేందర్ , సర్పంచ్లు గొట్టిముక్కుల భూమన్న, చిన్ను, పెండెపు కృష్ణ ,అనిల్ ఉన్నారు.
తాజావార్తలు
- ఫేస్బుక్, ట్విట్టర్లకు కేంద్రం ఝలక్:21న విచారణకు రండి!
- నేడు ఐపీవోకు ఐఆర్ఎఫ్సీ: లక్ష్యం రూ.4,633 కోట్ల సేకరణ
- గోస్వామికి బాలాకోట్ దాడి ముందే తెలుసా?!
- హిందూ మనోభావాలు దెబ్బతీసేలా తాండవ్?!
- ఆదాతో ఆర్థిక కష్టాలకు చెక్: బీ అలర్ట్.. కరోనా ఎఫెక్ట్
- మాస్క్.. మట్టిలో కలిసేందుకు 50 ఏండ్లు
- ఎస్వీబీసీకి రూ.1.11 కోట్ల విరాళం
- రేపు అంగన్వాడీ సిబ్బందికి చీరెలు పంపిణీ
- జూబ్లీహిల్స్లో గ్యాంగ్వార్ కలకలం
- రామ్ చరణ్ ఖాతాలో మరో ఇద్దరు దర్శకులు.. నెక్ట్స్ ఏంటి..?
MOST READ
TRENDING